తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం.. ఫ్యూచర్ సిటీపై నాగర్జున కామెంట్స్

రెండు రోజులపాటు నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్  ప్రారంభమైంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు సమ్మిట్‌కు వచ్చారు.

Published on: Dec 08, 2025 3:20 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రైజింగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో ఈ సమావేశం జరుగుతోంది. ప్రారంభోత్సవానికి 44 దేశాల నుండి 154 మంది ప్రతినిధులు హాజరు అయ్యారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్

విజన్ 2047 ప్రణాళిక, వ్యాపార అవకాశాలు, పెట్టుబడులకు ప్రభుత్వ మద్దతు, తెలంగాణ పాలన వ్యూహాలు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి కీలక అంశాలను ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది. అనేక మంది జాతీయ ప్రతినిధులు, ప్రముఖులు ఇప్పటికే వచ్చారు. సదస్సు ప్రారంభానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకుని స్టాళ్లను పరిశీలించారు. తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

నిర్ణీత లక్ష్యాలు నిర్దేశించుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఈ సందర్భంగా అన్నారు. 2047లోగా 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యమని గుర్తు చేశారు. మహిళా రైతులను పలు విధాలుగా ప్రోత్సహిస్తున్నట్టుగా చెప్పారు. బస్సుల నిర్వహణ కూడా మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. వికసిత్ భారత్ దిశగా వేగంగా తెలంగాణ అడుగులు వేస్తోందన్నారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కారులో సమ్మిట్ వద్దకు నటుడు నాగర్జున వచ్చారు. అనంతరం ముఖ్యమంత్రితో కలిసి స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగర్జున మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడారు. 50 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నామని, ఇక్కడ బాగుందని చెప్పారు. తెలంగాణలో అన్నపూర్ణ స్టూడియో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు, ఫ్యూచర్ సిటీలో మరో స్టూడియో నిర్మాణానికి బాలీవుడ్ ప్రముఖులు కలిసి ముందుకు రావడం మంచి పరిణామం అని చెప్పారు. అందరూ కలిసి వస్తే ప్రపంచ వ్యాప్త ఫెసిలిటీస్‌తో పెద్ద నిర్మాణం చేయవచ్చన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఫ్యూచర్ సిటీ ఆలోచన బాగుందన్నారు నాగర్జున.

తయారీ, నిర్మాణ వృద్ధిలో తెలంగాణ అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్ అని తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఒంటరిగా మనం చాలా తక్కువ చేయగలమని, కలిసి మనం చాలా చేయగలమని చెప్పారు. రాష్ట్ర లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం, పరిశ్రమ, ప్రతినిధుల మధ్య సహకారాన్ని ఆయన నొక్కి చెప్పారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం.. విక్షిత్ భారత్ లక్ష్యం వైపు వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ఈ సమావేశాన్ని విజయవంతంగా అభివర్ణించారు. 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే వ్యవసాయ రుణ మాఫీల గురించి కూడా మాట్లాడారు.