Telangana Rythu Bharosa Scheme: రాష్ట్రంలోని అన్నదాతలకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులు మంగళవారం(ఇవాళ) విడుదల కానున్నాయి సాయంత్రం నుంచే రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి. మొదటి విడత కింద రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు ఈ లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,482.02 కోట్లను సిద్ధం చేసింది.

హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే 'రైతు ఆశీర్వాద సభ' ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల్యాప్ట్యాప్లో మీట నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేస్తారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం……. ఈ రైతు ఆశీర్వాద సభను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చింతకానిలో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ సభ నిర్వహణ సాధ్యపడలేదు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని శిల్పకళా వేదికకు మార్చారు.
ఈ సీజన్లో ఎకరానికి రూ.ఆరు వేల చొప్పున.. మొత్తం 73.32 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటిన్నర ఎకరాలకు గానూ మొత్తం రూ.9 వేల కోట్లను దశలవారీగా విడుదల చేస్తారు. ఇందులో భాగంగానే తొలి విడతలో రెండు ఎకరాల లోపు ఉన్న 41.37 లక్షల మంది చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమవుతాయి.
కొత్త పట్టాదారులకు కూడా ఛాన్స్…!
మరోవైపు రాష్ట్రంలోని కొత్త పట్టాదారులకు వ్యవసాయ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 15వ తేదీ వరకు కొత్తగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, పట్టాదారు పాస్పుస్తకాలు పొందిన రైతులందరూ రైతు భరోసా పథకానికి అర్హులని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్తగా పాస్పుస్తకాలు అందుకున్న రైతులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది.
{{/usCountry}}మరోవైపు రాష్ట్రంలోని కొత్త పట్టాదారులకు వ్యవసాయ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 15వ తేదీ వరకు కొత్తగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, పట్టాదారు పాస్పుస్తకాలు పొందిన రైతులందరూ రైతు భరోసా పథకానికి అర్హులని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్తగా పాస్పుస్తకాలు అందుకున్న రైతులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది.
{{/usCountry}}కొత్తగా పట్టాదారు పాస్పుస్తకాలు పొందిన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)ని లేదా మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో)ని కలిసి తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. పాస్పుస్తకం ప్రతి, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో అధికారులను సంప్రదించి, గడువు(జూలై 5) ముగిసేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కోరింది. కొత్త రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేశారు.
రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ఈ మొత్తం రెండు దఫాలుగా ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి విడతలో రూ. 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఖరీఫ్, రబీ సీజన్ ల కోసం రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుంది.