Singareni Gold Exploration Karnataka : బొగ్గు గనుల తవ్వకాల్లో శతాబ్దానికి పైగా విశేష అనుభవం ఉన్న తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన వ్యాపార విస్తరణలో భాగంగా మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా లింగదహళ్లి గ్రామానికి సమీపంలో ఉన్న దేవదుర్గ బ్లాక్లో ప్రతిష్టాత్మకమైన బంగారం, రాగి (కాపర్) ఖనిజ నిక్షేపాలా అన్వేషణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రారంభించింది.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి ఈ మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన అధికారులతో కలిసి ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ…. గనుల రంగంలో సింగరేణికి దాదాపు 136 సంవత్సరాల సుదీర్ఘ అనుభవముందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన జాతీయ స్థాయి వేలంలో అత్యంత పోటీ నడుమ సింగరేణి సంస్థ దేవదుర్గ బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకోవడం అభినందనీయమని చెప్పారు. త్వరలోనే ఇక్కడ అన్వేషణ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
దేవదుర్గ బ్లాక్లో చేపడుతున్న ఈ పరిశోధనలు సఫలమై, ఆశించిన స్థాయిలో బంగారం, రాగి నిక్షేపాలు లభ్యమైతే రాయచూర్ ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున గనుల తవ్వకాలు ప్రారంభమైతే స్థానిక నిరుద్యోగ యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ సాధించే విజయం తెలంగాణ, కర్ణాటక రెండు రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి ఎంతగానో తోడ్పడుతుందని, దేశ ఖనిజ సంపదను పెంచి జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని వివరించారు.
దేవదుర్గలో సైట్ ఆఫీస్, హెలిప్యాడ్ ఏర్పాటు
పనుల పర్యవేక్షణను వేగవంతం చేసేందుకు సింగరేణి అధికారులు స్థానికంగానే ఉండేలా దేవదుర్గలో త్వరలోనే ఒక ప్రత్యేక 'సైట్ ఆఫీస్'ను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో పాటు అధికారుల అత్యవసర రాకపోకల సౌకర్యార్థం ఒక హెలిప్యాడ్ను కూడా నిర్మిస్తామన్నారు. దీనికి అవసరమైన భూమిని స్థానిక రెవెన్యూ అధికారులు కేటాయించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్ణీత సమయంలోగా విజయవంతంగా పూర్తి చేసేందుకు స్థానిక ప్రజలు, యంత్రాంగం సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు.
ఖనిజ నమూనాల ప్రదర్శన పరిశీలన
{{/usCountry}}పనుల పర్యవేక్షణను వేగవంతం చేసేందుకు సింగరేణి అధికారులు స్థానికంగానే ఉండేలా దేవదుర్గలో త్వరలోనే ఒక ప్రత్యేక 'సైట్ ఆఫీస్'ను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో పాటు అధికారుల అత్యవసర రాకపోకల సౌకర్యార్థం ఒక హెలిప్యాడ్ను కూడా నిర్మిస్తామన్నారు. దీనికి అవసరమైన భూమిని స్థానిక రెవెన్యూ అధికారులు కేటాయించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్ణీత సమయంలోగా విజయవంతంగా పూర్తి చేసేందుకు స్థానిక ప్రజలు, యంత్రాంగం సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు.
ఖనిజ నమూనాల ప్రదర్శన పరిశీలన
{{/usCountry}}తన పర్యటనలో భాగంగా లింగదహళ్లి వ్యూపాయింట్ నుంచి అన్వేషణ కోసం గురించిన ప్రాంతాలను డిప్యూటీ సీఎం పరిశీలించారు. అనంతరం సింగరేణి అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను సందర్శించారు. ఇప్పటివరకు సేకరించిన వివిధ రకాల ఖనిజ నమూనాలను (సాంపిల్స్) ఆయన ఆసక్తిగా తిలకించారు. బంగారం, రాగి నిక్షేపాల వెలికితీత సాంకేతికత, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఒకప్పుడు ‘బ్లాక్ గోల్డ్’గా పిలిచే బొగ్గుతో గుర్తింపు పొందిన సింగరేణి... ఇప్పుడు నిజమైన ‘గోల్డ్’నే వెలికితీయబోతోంది. ఈ సరికొత్త ప్రయోగం విజయవంతమైతే.. సింగరేణి చరిత్రలో మరో ప్రస్థానం షురూ అయినట్లు అవుతుంది.