తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల రూపంలో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచి లబ్ధిదారులకు అత్యాధునిక డిజైన్తో కూడిన ఆహార భద్రత కార్డుల(Smart Ration Cards) పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. డూప్లికేషన్, నకిలీ కార్డుల ముప్పునకు శాశ్వతంగా చెక్ పెడుతూ పౌరసరఫరాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నూతన కార్డుల తయారీలో ప్రభుత్వం అత్యున్నత రక్షణ ప్రమాణాలను పాటించింది. సాధారణంగా బ్యాంక్ నోట్లు, పాస్పోర్టులు, ఇతర గోప్యమైన ప్రభుత్వ పత్రాల తయారీలో వాడే 9 రకాల హై-టెక్ సెక్యూరిటీ ఫీచర్లను ఈ స్మార్ట్ కార్డుల్లో పొందుపరిచారు.
ఈ కార్డులను ప్రత్యేక పరికరాలతో స్కాన్ చేయగానే, లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి వివరాలు తక్షణమే డిజిటల్ స్క్రీన్పై దర్శనమిస్తాయి. అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉండటం వల్ల ఈ కార్డులను కాపీ చేయడం గానీ, నకిలీలను సృష్టించడం గానీ సాధ్యపడదు. కార్డు చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా, నాణ్యమైన మెటీరియల్తో రూపొందించారు. పై భాగంలో (ఎడమవైపు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటో, పై భాగంలో (కుడివైపు)పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఫొటో ఉంటాయి.
మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ మహిళల పేర్లే యజమానిగా ముద్రణ చేస్తారు. కార్డు నంబర్, లబ్ధిదారుని పూర్తి చిరునామా (గ్రామం, మండలం, జిల్లా), కేటాయించిన డిపో (రేషన్ షాప్) సంఖ్య ఉంటాయి. రేషన్ సరుకుల పంపిణీతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా ఈ ఆహార భద్రత కార్డులే ప్రామాణికంగా మారనున్నాయి. అర్హులైన ప్రతి కుటుంబానికీ ఈ కార్డులు అందేలా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. నకిలీ కార్డు ఏరివేత ద్వారా నిజమైన పేదలకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కార్డులో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సంతకం, హోలోగ్రామ్, రిలీఫ్ టెక్ట్స్, మైక్రో టెక్స్ట్, డ్యూయల్ హిడెన్ ఇమేజ్, వాటర్ మార్క్, యూవీ లోగో, ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
{{/usCountry}}ఈ కార్డులో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సంతకం, హోలోగ్రామ్, రిలీఫ్ టెక్ట్స్, మైక్రో టెక్స్ట్, డ్యూయల్ హిడెన్ ఇమేజ్, వాటర్ మార్క్, యూవీ లోగో, ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
{{/usCountry}}'ఆగస్టు 15 నుండి తెలంగాణలో కొత్త 'స్మార్ట్ రేషన్ కార్డ్' విధానం ప్రారంభం కానుంది. 1.06 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందుతాయి. 3.42 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రతి నెలా 6 కిలోల నాణ్యమైన బియ్యం ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. అనవసరమైన చిక్కులు లేకుండా, రేషన్ విధానాన్ని సరళతరం చేయడం, సంక్షేమ ఫలాలు నిజంగా అవసరమైన వారికి చేరేలా చూడటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఆహార భద్రత అనేది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, అది ఒక బాధ్యత. ప్రతి కుటుంబం ప్రభుత్వ మద్దతును పొందే అర్హత కలిగి ఉంది.' అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.