దుర్గం చెరువు సమీప భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు!
తెలంగాణ ప్రభుత్వం మరో భూముల ఈ వేలానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. ఇది దుర్గం చెరువుకు దగ్గరలో ఉంది.
తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా పర్యావరణపరంగా అత్యంత కీలకమైన మరొక భూభాగాన్ని వేలం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఈసారి ఈ వేలం దుర్గం చెరువుకు అత్యంత సమీపంలో జరగనుంది.

రాయదుర్గం పాన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 5.25 ఎకరాలు, 5.38 ఎకరాల విస్తీర్ణం గల రెండు ప్లాట్లను వేలం వేయడానికి TGIIC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భూమి దుర్గం చెరువుకు ఆనుకుని, హైటెక్ సిటీ వైపున ఉన్న ఐటీసీ కోహెనూర్ హోటల్ ఎదురుగా ఉంది. ఆగస్టు 1, 2026న ఈ నోటిఫికేషన్ ప్రచురితమైంది. ప్లాట్ 1కి ఆగస్టు 21న, ప్లాట్ 2కి ఆగస్టు 28న వేలం నిర్వహించనున్నారు. ఎకరాకు కనీస ధర (Base price) రూ.175 కోట్లుగా నిర్ణయించారు. ఈ లెక్కన రెండు ప్లాట్ల మొత్తం విలువ రూ.1,860.25 కోట్లకు చేరుతుంది. ప్లాట్ల ఫోటోలను చూస్తే, ఇది దుర్గం చెరువు క్యాచ్మెంట్ ప్రాంతంలో భాగమని స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ భూభాగంలో 250 కోట్ల సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీనమైన భారీ రాతి నిర్మాణాలు ఉన్నందున, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని హెరిటేజ్ ప్రిసింక్ట్స్(రక్షిత పర్యావరణ/చారిత్రక ప్రాంతం)గా ప్రకటించారని Rock enthusiasts స్పష్టం చేస్తున్నారు. ఇవి పురాతన దక్కన్ పీఠభూమి మూల శిలల్లో భాగంగా నమోదయ్యాయి. హిమాలయాల ఆవిర్భావం లేదా డైనోసార్ల కాలం కంటే ముందే ఏర్పడిన, భూమిపై అత్యంత ప్రాచీనమైన రాతి నిర్మాణాలలో ఇవి కూడా ఒకటని చెబుతుంటారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జోనింగ్ నిబంధనల ప్రకారం రక్షించబడిన 23 వారసత్వ రాతి నిర్మాణాల జాబితాలో 'దుర్గం చెరువు చుట్టూ ఉన్న గుట్టలు' మొదటి స్థానంలో ఉన్నాయని సొసైటీ టు సేవ్ రాక్స్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఖాజాగూడ హెరిటేజ్ రాళ్ళు కూడా ఈ నిబంధనల కిందే రక్షణ పొందుతున్నాయి.
TGIIC తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నెటిజన్లు ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కొందరు పర్యావరణ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు ఇప్పటికే తీవ్ర ట్రాఫిక్ సమస్యతో అల్లాడుతున్న ఆ రోడ్డులో మరిన్ని ప్రాజెక్టులకు అనుమతులివ్వడంపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
ఇప్పటికే ఆ ప్రాంతమంతా పీక్ అవర్స్లో తీవ్ర ట్రాఫిక్ జామ్తో స్తంభించిపోతోంది. నిజానికి సాయంత్రంపూటం కేబుల్ బ్రిడ్జి పైనుంచి వెళ్తుంటే.. కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఐటీసీ కొహినూర్ దగ్గర.. ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కుంటారు జనాలు. దానికి తోడు అదే ప్రాంతంలో అనేక భవనాల నిర్మాణాలు కూడా కొత్తగా జరుగుతున్నాయి. ఇప్పుడు మిగిలి ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలాల్లో కూడా నిర్మాణాలు వస్తే.. మరింత ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


