ఈ తేదీల్లో కైట్, బెలూన్, డ్రోన్ ఫెస్టివల్స్ ప్లాన్ చేసిన తెలంగాణ టూరిజం

తెలంగాణ రాష్ట్ర పర్యాటకం, సంస్కృతి, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ పర్యాటక శాఖ 2026 జనవరిలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ పెస్టివల్స్‌ను నిర్వహించనుంది. ఈ మేరకు ఏర్పాట్లపై దృష్టి పెట్టింది.

Published on: Dec 22, 2025, 11:45:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ పర్యాటక శాఖ 2026 జనవరిలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్, బెలూన్, డ్రోన్ ఫెస్టివల్‌తో సహా అనేక ప్రధాన పర్యాటక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ మేరకు ఏర్పాట్లుపై దృష్టి పెట్టింది. ఇంటర్నేషనల్ కైట్ మరియు స్వీట్ ఫెస్టివల్ 2026 జనవరి 13 నుండి 15 వరకు జరుగుతుంది. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ 2026 జనవరి 16 నుండి 18 వరకు జరగనుంది. అంతేకాకుండా జనవరి 13 మరియు 14 తేదీల్లోనే డ్రోన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.

తెలంగాణ పర్యాటక శాఖ
తెలంగాణ పర్యాటక శాఖ

తెలంగాణ పర్యాటక ప్రదేశాలను ప్రదర్శించడం, దేశీయ, అంతర్జాతీయ సందర్శకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించడం ఈ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ లక్ష్యం అని పర్యాటక అధికారులు తెలిపారు. కైట్స్ ఎగరవేయడం, ప్రాంతీయ స్వీట్లు వంటి సాంప్రదాయ ఆకర్షణలతో పాటు, విభిన్న సాంస్కృతిక, వినోద అనుభవాన్ని అందించడానికి హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ ప్రదర్శనలు వంటి ఆధునిక అనుభవాలను కూడా పర్యాటకులకు ఈ ఉత్సవాలు అందిస్తాయి.

ఇప్పటికే ఈ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్‌పై శాఖల సమన్వయ సమావేశం జరిగింది. ఈ ఉత్సవాలు తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక వైభవం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించడానికి, అలాగే జాతీయ, అంతర్జాతీయ పర్యాటక పటంలో రాష్ట్ర ఉనికిని బలోపేతం చేయడానికి పర్యాటక అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

ఈ కార్యక్రమాలు భారతదేశం నలుమూలల నుండి, విదేశాల నుండి సందర్శకులను ఆకర్షిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందులో సాంప్రదాయ ఆకర్షణలు, ఫుడ్ స్టాల్స్, ఇతర ప్రదర్శనలు ఉంటాయి.

ఇప్పటికే పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, పర్యాటక శాఖ డైరెక్టర్ క్రాంతి వల్లూరు, SATG వైస్-చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలాతోపాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More