ఈ మంచు కురిసే వేళల్లో పాపికొండలు ట్రిప్ - హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, ఓ లుక్కేయండి
హైదరాబాద్ నుంచి పాపికొండలు టూర్ ప్యాకేజీ వచ్చేసింది. తెలంగాణ టూరిజం ఆపరేట్ చేయనుంది. ఈ డిసెంబర్ నెలలోనే జర్నీ ఉంటుంది. ఆసక్తి గల టూరిస్టులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ మంచు కురిసే వేళలో పాపికొండల అందాలను చూడాలనుకుంటున్నారా..? గోదావరి అలలపై వివాహరిస్తూ సాగే అద్భుతమైన జర్నీని అస్వాదించాలనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి పాపికొండలు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ డిసెంబర్ నెలలోనే జర్నీ తేదీలున్నాయి.
పాపికొండలు టూర్
భద్రాచలం - పాపికొండలు నాన్ ఏసీ ప్యాకేజీ పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ నెలలో చూస్తే... 12, 19, 26 తేదీల్లో ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
టూర్ షెడ్యూల్ ఇలా:
డే 1: సాయంత్రం 7:30 గంటలకు హైదరాబాద్ ఐఆర్ఓ-పర్యాటక్ భవన్ నుంచి బస్సు (నాన్ ఏసీ)బయలుదేరుతుంది. రాత్రి 8 గంటలకు బషీర్బాగ్ చేరుకుటుంది. రాత్రి మొత్తం ప్రయాణం సాగుతుంది.
డే 2: ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. ఉదయం 8:00 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్కు వెళ్తారు. అక్కడి నుంచి లాంచీలో గోదావరిపైన పాపికొండలు టూర్ మొదలవుతుంది.పేరంటాలపల్లి, కొల్లూరు, కోర్టూరు ప్రాంతాల మీదుగా జర్నీ సాగుతుంది. స్నాక్స్, భోజనం ఇస్తారు. సాయంత్రానికి తిరిగి భద్రాచలం చేరుకుంటారు. అక్కడి హరిత హోటల్లో రాత్రి బస చేస్తారు.
డే 3: ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత భద్రాచలం రాములోరి ఆలయాన్ని రామాలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత పర్ణశాలను సందర్శిస్తారు. తిరిగి భద్రాచలం హరిత హోటల్కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం తర్వాత భద్రాచలం నుండి హైదరాబాద్ రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ధరల వివరాలు:
హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ పాపికొండలు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... పెద్దలకు రూ.6,999, పిల్లలకు రూ.5,599గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం https://tgtdc.in/ వెబ్ సైట్ చూడొచ్చు. 180042546464 టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా సంప్రదించి ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.