TG CPGET 2025 : ఇవాళ్టి నుంచి 'సీపీగెట్' ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ - సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?
పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ సీపీగెట్ - 2025 కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. నవంబర్ 9వ తేదీన అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు.
రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీపీగెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 2 విడతలు పూర్తి కాగా… తాజాగా ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?
ఆన్ లైన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 1లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అర్హులైన వివరాలను నవంబర్ 2వ తేదీన ప్రకటిస్తారు. నవంబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. నవంబర్ 5వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవాలి.
నవంబర్ 9వ తేదీన అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ ఫైనల్ ఫేజ్ కింద సీట్లు పొందే విద్యార్థులు…. నవంబర్ 11వ తేదీలోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. నిర్దేశించిన టైమ్ లోపు రిపోర్టింగ్ చేయకపోతే… సీటు కేటాయింపును రద్దు చేస్తారు.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా…
- అర్హులైన అభ్యర్థులు... https://cpget.ouadmissions.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని అప్లయ్ ఆన్ లైన్ వెరిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- ముందుగా లాగిన్ వివరాలను క్రియేట్ చేసుకోవాలి.
- కౌన్సెలింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 250, SC/ST/PH అభ్యర్థులురూ. 200 చెల్లించాలి.
- మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
- అలాట్ మెంట్ కాపీని కూడా ఇదే వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెల్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఉస్మానియా యూనివర్శిటీనే ఈ ప్రవేశ బాధ్యతలను చూస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

