...
...
Next Story

TG CPGET 2026 Updates : టీజీ సీపీగెట్ దరఖాస్తు గడువు పొడిగింపు - ముఖ్యమైన తేదీలు

TG CPGET Application Dates 2026 :తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CPGET) 2026 ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jun 13, 2026, 17:00:14 IST
Advertisement

TG CPGET Application Dates 2026 : రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'టీజీ సీపీజీఈటీ - 2026' (TG CPGET - 2026) రాసే అభ్యర్థులకు అలర్ట్. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువును అధికారులు పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుము (Late Fee) లేకుండా ఆన్‌లైన్ అప్లికేషన్లను సమర్పించడానికి చివరి తేదీని 2026 జూన్ 15 (సోమవారం) వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సవరించిన పూర్తి పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు.

ఫైన్ తో దరఖాస్తు తేదీలు…

టీజీ సీపీగెట్-2026 గడువు పొడిగింపు
టీజీ సీపీగెట్-2026 గడువు పొడిగింపు

విద్యార్థుల సౌకర్యార్థం పొడిగించిన ఈ గడువుతో పాటు…. ఒకవేళ జూన్ 15 లోపు దరఖాస్తు చేసుకోలేకపోతే రూ. 500 ఆలస్య రుసుముతో జూన్ 17 (బుధవారం) వరకు, అలాగే రూ. 2000 భారీ ఆలస్య రుసుముతో జూన్ 19 (శుక్రవారం) వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫారమ్‌లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి జూన్ 16 నుండి జూన్ 19 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

మరోవైపు పరీక్షల నిర్వహణకు సంబంధించి జూన్ 24 నాటికి టెస్ట్ సెంటర్లను ఖరారు చేయనున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను జూన్ 28 (ఆదివారం) నుండి అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ ప్రవేశ పరీక్షను జూలై మొదటి వారంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మాత్రమే నిర్వహించనున్నారు.

పరీక్ష ముగిసిన అనంతరం జూలై 17న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఈ కీ పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే జూలై 19 వరకు ఒక్కో అభ్యంతరానికి రూ. 200 చెల్లించి ఫిర్యాదు చేయవచ్చు. అభ్యంతరం సరైనదేనని తేలితే, ఫలితాలు వచ్చిన 7 పనిదినాల్లోగా ఆ రుసుమును తిరిగి రీఫండ్ చేస్తారు. ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు, ర్యాంకుల ప్రకటన తేదీని తర్వాత వెల్లడిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe