...
...
Next Story

దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల.. ఆగస్టు 18 సెల్ఫ్ రిపోర్టింగ్

తెలంగాణ దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఆగస్ట్ 18లోపు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. లేకుంటే సీట్ క్యాన్సిల్ అవుతుంది.

Published on: Aug 15, 2026, 11:50:53 IST
Advertisement

తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సేవల (DOST - Degree Online Services, Telangana) స్పెషల్ డ్రైవ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 14,975 మంది విద్యార్థులకు తాత్కాలికంగా సీట్లు కేటాయించారు.

దోస్త్ ప్రవేశాలు
దోస్త్ ప్రవేశాలు

ఈ స్పెషల్ డ్రైవ్ విడతలో సీట్లు పొందిన అభ్యర్థుల్లో చాలామంది తమ ప్రాధాన్యత క్రమానికి అనుగుణంగానే సీట్లను సాధించారు. సీటు సాధించిన వారిలో 12,068 మంది విద్యార్థులు తమ మొదటి ప్రాధాన్యత ఆధారంగానే సీట్లను పొందారు. మిగిలిన 2,906 మంది విద్యార్థులకు వారి రెండవ లేదా తదుపరి ఆప్షన్ల ఆధారంగా సీట్లు లభించాయి.

కోర్సుల విషయానికొస్తే.. కామర్స్ 6,198, లైఫ్ సైన్సెస్ 3,080, ఫిజికల్ సైన్సెస్ 2,798, ఆర్ట్స్ 2,878, ఇతర కోర్సులు 21 సీట్లను కేటాంచారు. రాష్ట్రవ్యాప్తంగా DOST పరిధిలో మొత్తం 4,39,609 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉండగా, శుక్రవారం నాటికి 2,05,212 మంది విద్యార్థులు మాత్రమే తమ సీట్లను కన్ఫర్మ్ చేసుకున్నారని ఉన్నత విద్యా మండలి తెలిపింది.

సీట్లు పొందిన విద్యార్థులు తమ అడ్మిషన్‌ను రద్దు కాకుండా కాపాడుకోవడానికి నిర్దేశిత గడువులోగా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్ట్ పూర్తి చేయాలి.

ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చివరి తేదీ ఆగస్టు 18గా ఉంది. సీటు పొందిన విద్యార్థులు DOST అధికారిక వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయి తమ ప్రవేశ రుసుమును చెల్లించి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి.

నిర్ణీత గడువు (ఆగస్టు 18) లోగా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా లేదా కళాశాలలో రిపోర్ట్ చేసి ఓటీపీ సమర్పించకపోయినా అభ్యర్థులు తమకు కేటాయించిన సీటును పూర్తి స్థాయిలో కోల్పోతారు. కళాశాలలో రిపోర్ట్ చేసే సమయంలో విద్యార్థులు క్రింది సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాలి.

DOST అలోట్‌మెంట్ ఆర్డర్ మరియు సెల్ఫ్ రిపోర్టింగ్ రసీదు, పదో తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మేమోలు, టీసీ,స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు (వర్తించే వారికి), ఆధార్ కార్డ్ కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకెళ్లాలి.

TGCHE వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2,49,980 సీట్ల ప్రవేశానికి అవకాశం ఉన్న 584 ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కళాశాలల్లో 87,658 మంది విద్యార్థులు చేరగా, 1,62,322 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 36 అటానమస్ కళాశాలలు 45,060 సీట్లకు గాను 38,824 అడ్మిషన్లను నమోదు చేసుకోగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 21,182 ఖాళీలు ఉన్నట్లు నివేదించాలి. ఈ సంఖ్య మరింత పెరగనుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks