TG EAPCET - 2026 కౌన్సెలింగ్ అప్డేట్ : చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి - అలాట్‌మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే

TG EAPCET 2026 Final Phase Allotment : టీజీ ఈఏపీసెట్ 2026 ఆఖరి విడత కౌన్సెలింగ్ సీట్లను అధికారులు కేటాయించారు. ఆయా విద్యార్థులు… ఆగస్టు 7లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. సీఎస్ఈ సహా ప్రధాన బ్రాంచీల్లో పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి.

Published on: Aug 5, 2026, 07:50:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG EAPCET 2026 Final Phase Allotment : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) - 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ప్రవేశాల కమిటీ మంగళవారం చివరి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేసింది. ఈ విడతలో కొత్తగా 3,281 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి.

టీజీ ఈఏపీసెట్ 2026
టీజీ ఈఏపీసెట్ 2026

ఈ ఏడాది ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ద్వారా కన్వీనర్ కోటా కింద (ఈడబ్ల్యూఎస్ సీట్లతో కలిపి) మొత్తం 94,156 సీట్లు అందుబాటులో ఉంచారు. అన్ని విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి 75 వేలకుపైగా సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 19 వేలకుపైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. అం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తంగా 80 శాతం సీట్లు భర్తీ అయినట్లు లెక్కలు చెప్తున్నాయి.

విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపే కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ 19 బ్రాంచీల్లో మొత్తం 66,390 సీట్లు ఉండగా, 54,730 సీట్లు నిండాయి. డిమాండ్ ఎక్కువగా ఉండే ఈ కోర్సుల్లో కూడా 11,660 సీట్లు మిగిలిపోవడం గమనార్హం. గతంలో పోలిస్తే….. ఈసారి సీఎస్ఈ, ఐటీ విభాగాల్లో 82 శాతం సీట్లు మాత్రమే నిండాయి.

రిపోర్ట్ తేదీలివే…

టీజీ ఈఏపీసెట్ 2026 ఫైనల్ ఫేజ్ లో సీట్లు పొందిన అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆగస్టు 7వ తేదీలోగా అలాట్‌మెంట్ లెటర్‌లో సూచించిన ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన అనంతరం ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసి, సంబంధిత కళాశాలలో స్వయంగా హాజరై రిపోర్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.

TG EAPCET ఫైనల్ ఫేజ్ అలాట్ మెంట్ - ఎలా చెక్ చేసుకోవాలి?

  • అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.in ను సందర్శించాలి.
  • హోం పేజీలో కనిపించే 'Candidates Login' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మీ అలాట్ మెంట్ రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది.
  • భవిష్యత్తు అవసరాల కోసం విద్యార్థులు ఆ అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని… ప్రింట్ అవుట్ కాపీని భద్రపరుచుకోవాలి.
  • అడ్మిషన్ ప్రక్రియలో అలాట్ మెంట్ అర్డక్ కాపీ చాలా కీలకం.

ఆగస్టు 12, 13 తేదీల్లో స్లైడింగ్ అవకాశం

కళాశాలల్లో చేరిన విద్యార్థులు తమ బ్రాంచీలను మార్చుకోవాలనుకుంటే ఆగస్టు 12, 13 తేదీల్లో స్లైడింగ్ ప్రక్రియను నిర్వహిస్తామని ప్రవేశాల కమిటీ ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. స్లైడింగ్ ద్వారా బ్రాంచి మారినప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More