రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. అగ్రికల్చర్ - ఫార్మసీ స్ట్రీమ్ విభాగం పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరగనున్నాయి. అయితే వీటికి సంబంధించిన హాల్టికెట్లు నేటి నుంచి అందుబాటులోకి వస్తాయి. ఉదయం 11 గంటల తర్వాత వెబ్సైట్ ( eapcet.tgche.ac.in ) ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇక ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ అభ్యర్థులు వారి హాల్టికెట్లను ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఎప్సెట్ రాయడానికి విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించింది. ఇంజినీరింగ్ విభాగానికి ఏకంగా 2,10,308 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా…. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగాలకు 90,569 మంది దరఖాస్తు చేశారు. రెండు విభాగాల పరీక్షలు రాసేందుకు 317 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. అగ్రికల్చర్ విభాగం కోసం 106 కేంద్రాలను కేటాయించారు. ఇంజినీరింగ్ విభాగం పరీక్షల కోసం 115 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
పరీక్షా సమయానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని…. నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తి లేదని అధికారులు స్పష్టం చేశారు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట ఉంచుకోవాలని సూచించారు.
- అగ్రికల్చర్ - ఫార్మసీ: ఈ విభాగం పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరగనున్నాయి. వీటికి సంబంధించిన హాల్టికెట్లను గురువారం ఉదయం 11 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
- ఇంజినీరింగ్: ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ అభ్యర్థులు తమ హాల్టికెట్లను ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
టీజీ ఈఏపీసెట్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరించిన… అనంతరం ర్యాంకులను ప్రకటిస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.
{{/usCountry}}టీజీ ఈఏపీసెట్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరించిన… అనంతరం ర్యాంకులను ప్రకటిస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.
{{/usCountry}}