బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్ - ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం
టీజీ ఈఏపీసెట్ - 2025 బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈనెల 17,18 తేదీల్లో వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఈనెల 21లోపు సీట్ల కేటాయింపు ఉంటుంది.
రాష్ట్రంలో బీఫార్మసీ, ఫార్మాడీ బీటెక్ బయోమెడికల్, బయో టెక్నాలజీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగియగా… ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ మొదలైంది. రిజిస్ట్రేషన్లకు ఇవాళ ఒక్కరోజే అవకాశం ఉంది.

అర్హులైన అభ్యర్థులు https://tgeapcetb.nic.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈనెల 17వ తేదీన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈనెల 17, 18 తేదీల్లో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఈనెల 18వ తేదీన ఫ్రీజింగ్ చేసుకోవచ్చు.
ఈనెల 21వ తేదీన లేదా ఆలోపే ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందే విద్యార్థులు ఈనెల 21 నుంచి 22 తేదీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఈనెల 22, 23 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. ఈనెల 24 నాటికి ప్రవేశాల ప్రక్రియ ముగుస్తుంది.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా…
- అర్హులైన విద్యార్థులు https://tgeapcetb.nic.in/payFeeOnline.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ముందుగా లాగిన్ వివరాలను నమోదు చేయాలి. ఇందులో TGEAPCET-B హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- ఆ తర్వాత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.(బీసీ, ఓసీ రూ1200, ఎస్సీ ఎస్టీ రూ. 600)
- అనంతరం స్లాట్ బుకింగ్ ఆప్షన్ పై నొక్కి ప్రాసెస్ రిజిస్రేషన్ పూర్తి చేసుకోవాలి.
- వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంచుకోవాలి.
- అలాట్ మెంట్ కాపీని కూడా ఇదే వెబ్ సైట్ నుంచి పొందాలి.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ - కావాల్సిన పత్రాలు:
- TGEAPCET -2025 ర్యాంక్ కార్డు
- టీజీ ఈఏపీసెట్ హాల్ టికెట్
- ఆధార్ కార్డు
- టెన్త్ మెమో
- ఇంటర్ మెమో
- ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు
- టీసీ
- ఆదాయపు ధ్రువీకరణపత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- రెసిడెన్సీ సర్టిఫికెట్
- ఇతర పత్రాలు
ఇటీవలనే బైపీసీ విద్యార్థులకు ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. ఆయా కోర్సుల్లో 93.50 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 10,708 సీట్లు అందుబాటులో ఉండగా.. 15,192 మంది సీట్ల కోసం పోటీపడ్డారు. వీరిలో 10,012 మందికి సీట్లు దక్కాయి. ఇక ఈనెల 23వ తేదీ నుంచి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











