టీజీ ఈసెట్ - 2026 షెడ్యూల్ వచ్చేసింది. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తి చేసిన వారు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో చేరేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.
ఈనెల 9 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు…

టీజీ ఈసెట్ - 2026 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి షురూ అవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. గతేడాదితో పోల్చితే ఈసారి దరఖాస్తుల ముందుగానే ప్రారంభం కానుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 500గా నిర్ణయించారు. ఇక ఇతర అభ్యర్థులు రూ. 900 చెల్లించాలి. మే 15వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్య ఉంటుంది. ఫిబ్రవరి 5వ తేదీన ఈసెట్ నోటిఫికేషన్ అందుబాటులోకి వస్తుంది. https://ecet.tgche.ac.in వెబ్ సైట్ లో వివరాలను చూడొచ్చు.
మరోవైపు ఈసారి దరఖాస్తుల సంఖ్యను బట్టి పరీక్ష కేంద్రాల సంఖ్య పెంచే అంశంపై నిర్ణయం తీసుకునే దిశగా ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. దరఖాస్తుల విషయంలో కూడా విద్యార్థులు… చివరి తేదీల కోసం వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ ఏడాది కూడా ఉన్నత విద్యా మండలి తరపున ఉస్మానియా యూనివర్శిటీనే టీజీ ఈసెట్ - 2026 పరీక్షను నిర్వహించనుంది. మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 3 గంటల సమయం ఇస్తారు. గణితం (50), భౌతికశాస్త్రం (25), రసాయన శాస్త్రం (25), ఇంజినీరింగ్ విభాగం నుంచి 100 ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఉండగా… తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కింగ్ లేదు.
{{/usCountry}}ఈ ఏడాది కూడా ఉన్నత విద్యా మండలి తరపున ఉస్మానియా యూనివర్శిటీనే టీజీ ఈసెట్ - 2026 పరీక్షను నిర్వహించనుంది. మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 3 గంటల సమయం ఇస్తారు. గణితం (50), భౌతికశాస్త్రం (25), రసాయన శాస్త్రం (25), ఇంజినీరింగ్ విభాగం నుంచి 100 ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఉండగా… తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కింగ్ లేదు.
{{/usCountry}}టీజీ ఈసెట్ - 2026 పరీక్ష నిర్వహించిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.అన్నింటిని క్రోడీకరించి తుది ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి ఈ ప్రాసెస్ ను పూర్తి చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే… స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శాలను విడుదల చేస్తారు. సీట్లు పొందే విద్యార్థులు సకాలంలో రిపోర్టింగ్ చేయకపోతే కూడా సీటు కేటాయింపును రద్దు చేస్తారు.