ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు పూర్తిగా జవాబుదారిగా ఉంటుందని, 22A నిషేధిత భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు మరియు సబ్ రిజిస్ట్రార్లతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 22A తో ఉత్పన్నమవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

న్యాయబద్ధంగా ఉన్న ప్రైవేటు భూమికి ఒక్క గజానికి కూడా 22A ద్వారా ఆటంకం కలగనివ్వమని, అదే సమయంలో ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కానివ్వబోమని మంత్రి పొంగులేటి తేల్చిచెప్పారు. 22Aను భూతంగా చూపి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరిస్తూ, ఇప్పటివరకు వచ్చిన 757 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
'అధికారుల నిర్లక్ష్యం వల్ల లేదా జాప్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడితే తీవ్రంగా పరిగణిస్తాం. సమస్యలను చిన్నవిగా దాటవేయకుండా పరిష్కరించడం అధికారుల బాధ్యత. కేవలం 22A జాబితాలో ఉందనే కారణంతో దరఖాస్తులను తిరస్కరించకూడదు. ఆ భూమి నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది? రికార్డులు ఏం చెబుతున్నాయి? వాస్తవ పరిస్థితి ఏమిటి? అనే అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
22A సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు ఇద్దరు అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజల సందేహాల నివృత్తి కోసం, తమ సమస్యలను విన్నవించుకోవడం కోసం 18005994788 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చామన్నారు. సబ్ రిజిస్ట్రార్లకు నేరుగా పహానీ యాక్సెస్ కల్పించామన్నారు. రికార్డులను పరిశీలించి జెన్యూన్ కేసులను వెంటనే పరిష్కరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అవసరమైతే స్లాట్ బుకింగ్ల సంఖ్యను పెంచాలని, కార్యాలయాల పనివేళలను కూడా పొడిగించాలని ఆదేశించారు.
'రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేని కేసుల్లో ఎందుకు చేయడం లేదో ప్రజలకు స్పష్టమైన కారణం తెలియజేయాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఉంటే నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లేఅవుట్ అనుమతుల రికార్డులను ప్రభుత్వం ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది.' అని పొంగలేటి చెప్పారు.
{{/usCountry}}'రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేని కేసుల్లో ఎందుకు చేయడం లేదో ప్రజలకు స్పష్టమైన కారణం తెలియజేయాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఉంటే నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లేఅవుట్ అనుమతుల రికార్డులను ప్రభుత్వం ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది.' అని పొంగలేటి చెప్పారు.
{{/usCountry}}గతంలో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను నాటి అధికారులు సరిగ్గా అప్డేట్ చేయకపోవడంతో అవి నేటికీ 22A లోనే ఉండిపోయాయని పొంగలేటి అన్నారు. దీనివల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. భూదాన్, దేవాదాయ, ఫారెస్ట్ భూముల పక్కన ఉన్న ప్రైవేటు భూములకు ఒకే సర్వే నంబర్ ఉండటం వల్ల కూడా కొన్ని స్థలాలు నిషేధిత జాబితాలోకి వెళ్లాయన్నారు. వీటిని ప్రత్యేకంగా గుర్తించి క్లియర్ చేయనున్నారు.
ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న భూమి నిషేధిత జాబితాలో ఉంటే, దానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి సమస్యను పరిష్కరించి రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తారని పొంగలేటి తెలిపారు. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించడం.. నిజమైన హక్కుదారులకు న్యాయం చేస్తామన్నారు.