TG ICET 2026 Counselling : టీజీ ఐసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల - అలాట్మెంట్ లింక్, రిపోర్టింగ్ వివరాలు
TG ICET 2026 Seat Allotment : టీజీ ఐసెట్ తొలి విడత కౌన్సెలింగ్లో 54 శాతం ఎంబీఏ, ఎంసీఏ సీట్లు భర్తీ అయ్యాయి. అలాట్మెంట్ పొందిన విద్యార్థులు ఆగస్టు 14లోగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
TG ICET 2026 Counselling Updates : టీజీ ఐసెట్ (TG ICET) - 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కాలేజీల్లోని కోర్సులకు సంబంధించి మంగళవారం విద్యార్థులకు సీట్లను కేటాయించారు. తొలి విడత కౌన్సెలింగ్ ముగిసే సమయానికి మొత్తం సీట్లలో 54 శాతం భర్తీ అయినట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కలిపి మొత్తం 36,241 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో 19,526 సీట్లలో విద్యార్థులు చేరగా, ఇంకా 16,715 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 309 ఎంబీఏ కళాశాలల్లో మొత్తం 29,457 సీట్లు ఉంటే.. అందులో 16,896 సీట్లు భర్తీ అయ్యాయి.
- ఎంసీఏ కోర్సు: 92 కళాశాలల్లో అందుబాటులో ఉన్న 6,784 ఎంసీఏ సీట్లలో 2,630 సీట్లు మాత్రమే కేటాయింపు పూర్తి చేసుకున్నాయి.
ఆగస్టు 14 చివరి తేదీ…..
టీజీ ఐసెట్ కౌన్సెలింగ్లో సీటు పొందిన విద్యార్థులు తమ అడ్మిషన్ను ఖరారు చేసుకోవడానికి నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి. ఆగస్టు 14వ తేదీ వరకు మాత్రమే దీనికి గడువు ఇచ్చారు. నిర్దేశిత సమయం లోపు ఫీజు చెల్లించకపోయినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా అభ్యర్థి పొందిన సీటు కేటాయింపు రద్దవుతుంది.
అలాట్ మెంట్ డౌన్లోడ్ ఇలా….
- ముందుగా తెలంగాణ ఐసెట్ అధికారిక పోర్టల్ https://tgicet.nic.in/default.aspx ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో కనిపిస్తున్న 'Candidate Login' ఆప్షన్పై క్లిక్ చేయండి.
- మీ లాగిన్ ఐడీ (Login ID), హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number), పాస్వర్డ్, పుట్టిన తేదీ, స్క్రీన్పై ఉన్న క్యాప్చా కోడ్ను నమోదు చేసి లాగిన్ అవ్వండి.
- లాగిన్ అయిన తర్వాత మీకు సీటు కేటాయింపు జరిగి ఉంటే, అలాట్మెంట్ ఆర్డర్ స్క్రీన్పై కనిపిస్తుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా మీ అలాట్మెంట్ కాపీని సేవ్ చేసుకోవచ్చు.
- కాలేజీలో చేరే సమయంలో ఈ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అత్యంత కీలకం.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

