...
...
Next Story

TG POLYCET 2026 Counselling : పాలిసెట్ అభ్యర్థులకు అప్డేట్ - ఇంటర్నల్ స్లైడింగ్ కు ఛాన్స్..!

TG POLYCET 2026 Internal Sliding : టీజీ పాలిసెట్ అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ కు అవకాశం కల్పించింది. ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి జూన్ 28వ తేదీ (నేడే) తుది గడువు.

Published on: Jun 28, 2026, 11:39:48 IST
Advertisement

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిసెట్ (TG POLYCET 2026) కౌన్సిలింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీతో పాటు, ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు బ్రాంచ్ మార్చుకునేందుకు…. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ (Centralized Internal Sliding), స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

తెలంగాణ పాలిసెట్ 2026
తెలంగాణ పాలిసెట్ 2026

ప్రస్తుతం చదువుతున్న పాలిటెక్నిక్ కళాశాలల్లోనే ఇతర బ్రాంచ్‌లకు (ఉదాహరణకు ఈసీఈ నుంచి కంప్యూటర్ సైన్స్ లేదా మెకానికల్ నుంచి సివిల్ వంటి ఇతర విభాగాలకు) మారాలనుకునే విద్యార్థులు ఈ ఇంటర్నల్ స్లైడింగ్ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్ ద్వారా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి జూన్ 28వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈలోపు ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

అర్హత కలిగిన విద్యార్థులకు అంతర్గతంగా బ్రాంచ్ మారినప్పటికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం…. ఫీజు రీయింబర్స్‌మెంట్ యథావిధిగా వర్తిస్తుందని కన్వీనర్ కార్యాలయం స్పష్టం చేసింది. కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా తమకు నచ్చిన కోర్సులను ఎంచుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

  • ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ల నమోదు : జూన్ 28-2026 వరకు (నేడే ఆఖరి గడువు).
  • సీట్ల కేటాయింపు : ఆప్షన్లు ఎంచుకున్న విద్యార్థులకు మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా జూన్ 30-2026 న లేదా అంతకంటే ముందే సీట్లను కేటాయిస్తారు.
  • కొత్త అలాట్‌మెంట్ ఆర్డర్ - రిపోర్టింగ్: ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా కొత్త బ్రాంచ్ పొందిన విద్యార్థులు జూలై 1-2026 న తమ కొత్త అలాట్‌మెంట్ ఆర్డర్‌ను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే రోజున తాము చదువుతున్న కళాశాలలోని కొత్త బ్రాంచ్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
  • ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం మిగిలిపోయిన సీట్లను ఆయా కళాశాలల్లో నేరుగా స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం టీజీ పాలిసెట్ అధికారిక వెబ్‌సైట్‌ ( https://tgpolycet.nic.in/ ) ను సందర్శించవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe