TG TET Applications : తెలంగాణ టెట్ అప్డేట్ - దరఖాస్తులకు దగ్గరపడిన గడువు, వెంటనే అప్లయ్ చేసుకోండి

TG TET Registration : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2026) దరఖాస్తుల గడువు దగ్గరపడుతోంది.ఏప్రిల్ 30వ తేదీతో  గడువు ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Published on: Apr 28, 2026, 11:51:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG TET Registration 2026: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగియనుంది. సమయం దగ్గరపడిన నేపథ్యంలో అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ టెట్ 2026
తెలంగాణ టెట్ 2026

ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు, ఫీజు చెల్లించి అప్లికేషన్ పెండింగ్‌లో ఉంచిన వారు తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తకముందే దరఖాస్తును సమర్పించడం ఉత్తమం.

ముఖ్యమైన తేదీలు ఇవే:

  • దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2026
  • పరీక్ష నిర్వహణ: మే నెలలో నిర్ణీత తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో జరుగుతుంది.
  • హాల్ టికెట్ల జారీ: పరీక్షకు వారం రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

టీజీ టెట్ దరఖాస్తు విధానం:

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందుగా నిర్ణీత పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన తర్వాత వచ్చే 'జర్నల్ నంబర్' ఆధారంగా పూర్తి వివరాలతో దరఖాస్తును సబ్మిట్ చేయాలి. కేవలం ఫీజు చెల్లించి వదిలేస్తే దరఖాస్తు పరిగణనలోకి తీసుకోబడదు.

  1. ముందుగా https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని అప్లికేషన్ ఫీజు లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
  3. ఆ తర్వాత అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవుతుంది.
  4. మీ వివరాలతో పాటు ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  5. చివరగా సబ్మిట్ చేస్తే మీ టెట్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.

టీజీ టెట్ 2026 ఫీజు కింద…. జనరల్, బీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ. 750, రెండు పేపర్లకు కలిపి రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు అయితే ఒక పేపర్‌కు రూ. 700, రెండు పేపర్లకు కలిపి రూ. 950 చెల్లించాల్సి ఉంటుంది.

టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్డామ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న టీచర్లకు కూడా టెట్‌ తప్పనిసరి కావడంతో చాలా మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More