TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు అలర్ట్ - 'వాట్సాప్' సేవలు వచ్చేశాయ్..! ఈ నెంబర్ సేవ్ చేసుకోండి
టీజీఎస్పీడీసీఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ చాట్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించే సేవలను ప్రారంభించింది. ఈ మేరకు 8712441912 నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) కీలక అలర్ట్ ఇచ్చింది. ఇప్పటికే పలు సాంకేతిక ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురాగా... తాజాగా వాట్సాప్ చాట్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించే సేవలను ప్రారంభించింది. ఈ నూతన విధానం ద్వారా వినియోగదారుల సమస్యలను మరింత వేగంగా,సమర్థవంతంగా పరిష్కరించవచ్చని సంస్థ తెలిపింది.

అప్రకటికత కరెంట్ కట్, విద్యుత్ మీటర్లలో సమస్యలు, కరెంట్ బిల్లుల చెల్లింపు, స్టేటస్ వంటి వాటిని ఒక్క మెసేజ్తో తెలుసుకోవచ్చు. ఈ మేరకు 8712441912 నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాట్సాప్ సేవలను ఎలా ఉపయోగించాలి...?
- TGSPDCL విద్యుత్ వినియోగదారులు మొదటగా మీ ఫోన్లో 8712441912 అనే నంబర్ను సేవ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత, ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా 'హాయ్' అని సందేశం పంపాలి.
- వెంటనే, 'వెల్కమ్ టు టీజీఎన్పీడీసీఎల్ కాల్ సెంటర్' అనే సందేశం వస్తుంది.
- వ్యూ మెనూపై క్లిక్ చేస్తే స్క్రీన్పై 'రిజిస్టర్ కంప్లైంట్', 'ట్రాక్ కంప్లైంట్', బిల్ రిలేటెడ్, పవర్ సప్లై స్టేటస్, 'చాట్ విత్ ఏజెంట్' అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
- మీరు 'రిజిస్టర్ కంప్లైంట్' ఎంచుకుని, మీ సర్వీస్ నంబర్ను నమోదు చేయాలి.
- సర్వీస్ నంబర్ నమోదు చేయగానే మీ విద్యుత్ సర్వీస్ వివరాలు కనిపిస్తాయి. వివరాలు సరైనవే అయితే, మీరు ఫిర్యాదుకు సంబంధించిన మెనూను చూడవచ్చు.
- మెనూలో కనిపించే సమస్యల విభాగాల నుంచి మీకు ఎదురైన సమస్యను ఎంచుకుని ఫిర్యాదు నమోదు చేయాలి.
- ఒకవేళ మీరు నేరుగా మాట్లాడాలనుకుంటే 'చాట్ విత్ ఏజెంట్' ఆప్షన్ ఉపయోగించవచ్చు.
- ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే మీకు ఒక కంప్లైంట్ ఐడీ లభిస్తుంది. ఈ ఐడీతో సమస్య పరిష్కార పురోగతిని ఎప్పుడైనా ట్రాక్ చేయవచ్చు.
ఈ వాట్సాప్ చాట్ బాట్ సేవలతో వినియోగదారుల సమస్యలను వేగంగా తెలుసుకోవటంతో పాటు పరిష్కరించవచ్చని సంస్థ అధికారులు తెలిపారు. ఈ తరహా సేవలపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

