ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 17,18తో పాటు 23వ తేదీల్లో ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో బస్సు ఛార్జీలు అదనంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి టీజీఎస్ఆర్టీసీ ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చింది.

ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులను నడుపుతోందని వివరించింది. రద్దీ సమయాల్లో ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ స్వంత గ్రామాలకు చేరుకునేలా ఈ సర్వీసులను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.
టీజీఎస్ఆర్టీసీ వివరణ ప్రకారం….. ప్రభుత్వ ఉత్తర్వు (GO) నం.16 (2003) ప్రకారం... డీజిల్, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ప్రత్యేక బస్సుల ఛార్జీలను సవరించే అధికారం TGSRTCకి ఉంది. ఈ నిబంధన మేరకు పండుగలూ, ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక బస్సుల ఛార్జీలను 1.5 రెట్లు అంటే గరిష్టంగా 50 శాతం వరకు పెంచవచ్చు. దీని ప్రకారం కేవలం ప్రత్యేక బస్సులకు మాత్రమే అత్యధిక రద్దీ ఉండే తేదీలలో అంటే మార్చి 17, 18, 23 తేదీలలో మాత్రమే సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. సాధారణ బస్సు సర్వీసుల లో యథావిధిగా ఎప్పటిలాగే సాధారణ ఛార్జీలే ఉంటాయి.
యథావిధిగా మహాలక్ష్మి పథకం:
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఈ క్రింది బస్సులలో యధావిధిగా కొనసాగుతుంది:
•పల్లె వెలుగు
{{/usCountry}}•పల్లె వెలుగు
{{/usCountry}}•ఎక్స్ప్రెస్
•సిటీ ఆర్డినరీ
•మెట్రో ఎక్స్ప్రెస్
పండుగ సర్వీసులు, ఛార్జీల గురించి ఖచ్చితమైన సమాచారం కోసం ప్రయాణికులు అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని టీజీఎస్ఆర్టీసీ కోరింది. ఫేక్ వార్తలను నమ్మవద్దని సూచించింది.