ఈ నెల 22 నుంచి చేపట్టబోయే సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు తెలిపాయని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కేవలం ప్రకటనలకే పరిమితమైందని, కాలయాపన కోసమే కమిటీలు వేశారని జేఏసీ ఛైర్మన్ వెంకన్న విమర్శించారు. మెట్రోపై ఉన్న ప్రేమ ఆర్టీసీపై లేదని విమర్శించారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న పాలకులు, ఆర్టీసీని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే, మూసీ పునరుజ్జీవనానికి వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని వెంకన్న ప్రశ్నించారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని, హైదరాబాద్లో ఆర్టీసీ ఉనికినే లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
'ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఈ పోరాటంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా భాగస్వాములు కావాలి. ఈ సమ్మె రాబోయే రోజుల్లో మరో 'సకల జనుల సమ్మె'ను తలపిస్తుంది.' అని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలు జరపాలని, లేనిపక్షంలో సమ్మె తీవ్రత పెంచుతామని జేఏసీ నేతలు హెచ్చరించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలు జరపాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. లేదంటే.. సమ్మె తీవ్రత పెంచుతామని హెచ్చరించింది. మరికొన్ని గంటల్లో సమ్మె ప్రారంభం కానుందని, ఇప్పటికీ సమ్మె నివారణకు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని తెలిపింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని అడుగుతున్నా.. పట్టించుకోవడం లేదని జేఏసీ చెప్పింది.
'సమ్మె చేయకుండా కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరు భయానికి గురికావొద్దు. కార్మికులు అందరూ సమ్మె చేయడానికీ సిద్ధంగా ఉన్నారు. కాలయాపన కోసమే కమిటీ అంటున్నారు. మెట్రో రైల్ వ్యవస్థను వెంటనే విలీనం చేసింది ప్రభుత్వం. ఆర్టీసీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు వెళ్లటానికి జేఏసీ సిద్ధంగా ఉంది.' అని జేఏసీ ఛైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు.
{{/usCountry}}'సమ్మె చేయకుండా కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరు భయానికి గురికావొద్దు. కార్మికులు అందరూ సమ్మె చేయడానికీ సిద్ధంగా ఉన్నారు. కాలయాపన కోసమే కమిటీ అంటున్నారు. మెట్రో రైల్ వ్యవస్థను వెంటనే విలీనం చేసింది ప్రభుత్వం. ఆర్టీసీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు వెళ్లటానికి జేఏసీ సిద్ధంగా ఉంది.' అని జేఏసీ ఛైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు.
{{/usCountry}}తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యూనియన్లు, జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో ఏప్రిల్ 22 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో అంతరాయం కలగనుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై ప్రభుత్వ యంత్రాంగంతో వారాల తరబడి జరిపిన చర్చలు విఫలమైన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. జేఏసీ మూడు కీలక ప్రాధాన్యతలతో 32 డిమాండ్లను ప్రవేశపెట్టింది. చర్చలు విఫలమైన తర్వాత మార్చి 13న జేఏసీ అధికారిక నోటీసు జారీ చేసినప్పటి నుండి సమ్మె గురించి ఆందోళన కొనసాగుతూనే ఉంది.