తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యూనియన్లు, జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో ఏప్రిల్ 22 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో అంతరాయం కలగనుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై ప్రభుత్వ యంత్రాంగంతో వారాల తరబడి జరిపిన చర్చలు విఫలమైన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. జేఏసీ మూడు కీలక ప్రాధాన్యతలతో 32 డిమాండ్లను ప్రవేశపెట్టింది.
ప్రధాన డిమాండ్లు :
రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం

ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ భద్రత కల్పించేందుకు టీజీఎస్ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వ వ్యవస్థలో పూర్తిగా విలీనం చేయడం.
జీతభత్యాలు, పింఛన్లు
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న జీతాల సవరణలు, పటిష్టమైన పింఛను ప్రయోజనాలను తక్షణమే అమలు చేయడం.
పని పరిస్థితులు
రోజువారీ కార్యకలాపాలు, సిబ్బంది సంక్షేమంలో స్పష్టమైన మెరుగుదలలు కోరుకుంటున్నారు ఉద్యోగులు.
చర్చలు విఫలమైన తర్వాత మార్చి 13న జేఏసీ అధికారిక నోటీసు జారీ చేసినప్పటి నుండి సమ్మె గురించి ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ 22 గడువు సమీపిస్తుండటంతో అన్ని జిల్లాల్లో విస్తృత స్థాయిలో సేవలు నిలిచిపోతాయని యూనియన్ నాయకులు హెచ్చరిస్తున్నారు.
నగరాల మధ్య, నగరంలోపల ప్రయాణాల కోసం ఆర్టీసీ బస్సులపై ఆధారపడే లక్షలాది మంది రోజువారీ ప్రయాణికులకు, ఈ సమ్మె తీవ్రమైన రవాణా సవాళ్లను, సుదీర్ఘ జాప్యాలను కలిగించవచ్చు.
అయితే లేబర్ కమిషన్ సమ్మె చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం డుమ్మా కొట్టింది. ఇక మీదట తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ జేఏసీ చెబుతోంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం సమ్మె సైరన్ మోగింది. ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టనున్నారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కొంతకాలంగా వేతనాలు, బెనిఫిట్స్, సర్వీస్ సమస్యల మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు. మార్చి 13న ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చాయి. కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి రాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు సమ్మె చేపట్టనున్నారు.
{{/usCountry}}తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కొంతకాలంగా వేతనాలు, బెనిఫిట్స్, సర్వీస్ సమస్యల మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు. మార్చి 13న ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చాయి. కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి రాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు సమ్మె చేపట్టనున్నారు.
{{/usCountry}}