ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి పవిత్ర ఘాట్ వద్ద వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ పుష్కరాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్బాబు, కొండా సురేఖ పాల్గొని నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తొలిసారిగా ఈ అంత్య పుష్కరాలను ఇంత భారీ ఎత్తున అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు.
ప్రభుత్వం ఏర్పాట్లు
ఘాట్ల పరిసరాల్లో ఎండ దెబ్బ తగలకుండా భారీ టెంట్లు, నిరంతరం చల్లటి గాలినిచ్చే కూలర్లను ఏర్పాటు చేశారు. సరస్వతీ ఘాట్తో పాటు ప్రధాన ఘాట్ల వద్ద భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా 300కు పైగా తాత్కాలిక గదులను నిర్మించారు.
నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ, భక్తులు లోతులోకి వెళ్లకుండా రక్షణ తాళ్లను కట్టారు. నిరంతరం నిఘా ఉంచేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను, గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. జూన్ 1వ తేదీ వరకు కొనసాగే ఈ పుష్కరాల్లో ప్రతిరోజు సాయంత్రం వేళల్లో నదీమతల్లికి అత్యంత కంటికింపైన ‘సరస్వతీ నది హారతి’ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ప్రత్యేకత ఏంటి?
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, బృహస్పతి (గురు గ్రహం) ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరాలు జరుగుతాయి. ప్రవేశించే మొదటి 12 రోజులను 'ఆది పుష్కరాలు' అని, ఆ రాశి నుంచి నిష్క్రమించే చివరి 12 రోజులను 'అంత్య పుష్కరాలు' అని పిలుస్తారు.
ఆది పుష్కరాల్లో నదీ స్నానం ఆచరించడం, పితృదేవతలకు తర్పణాలు/పిండప్రదానాలు చేయడం వల్ల ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయో.. అంత్య పుష్కర సమయంలోనూ ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తే అంతే సమానమైన ఫలితాలు, మోక్షం లభిస్తాయని ప్రముఖ సిద్ధాంతులు చెబుతున్నారు.
{{/usCountry}}ఆది పుష్కరాల్లో నదీ స్నానం ఆచరించడం, పితృదేవతలకు తర్పణాలు/పిండప్రదానాలు చేయడం వల్ల ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయో.. అంత్య పుష్కర సమయంలోనూ ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తే అంతే సమానమైన ఫలితాలు, మోక్షం లభిస్తాయని ప్రముఖ సిద్ధాంతులు చెబుతున్నారు.
{{/usCountry}}కాళేశ్వరం దక్షిణ గంగగా పిలిచే గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహిణిగా (భూగర్భంలో) ప్రవహించే సరస్వతీ నది కలయికతో ఏర్పడిన మహా పవిత్ర క్షేత్రం (త్రివేణీ సంగమం). భారతదేశంలో సరస్వతీ నది అంతర్వాహిణిగా ఉన్న క్షేత్రాలు రెండే రెండు: ఒకటి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (అలహాబాద్) – ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. తెలంగాణలోని కాళేశ్వరం-ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి.
5 రాష్ట్రాల నుండి భక్తుల రాక
ఈ అంత్య పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి దాదాపు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని బట్టి ప్రత్యేక రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని, త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.