తెలంగాణలో పెరిగిన పొగరాయుళ్లు.. ఇలా అయితే రెండు గాజులు అమ్ముకోవాల్సిందే!
తెలంగాణలో పొగ తాగేవారి సంఖ్య పెరుగుతోంది. గతంతో పోల్చుకుంటే గుట్కా తినేవారు కూడా పెరిగారు. ఓ ప్రభుత్వ సర్వే ఈ వివరాలను వెల్లడించింది.
తెలంగాణలో పొగాకు వాడే వారి సంఖ్య పెరిగింది. హైదరాబాద్లోని ఇళ్లలో పొగాకు వినియోగం గణనీయంగా పెరిగిందని ఇటీవల ప్రభుత్వ సర్వే వెల్లడించింది. గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24 ప్రకారం భాగ్యనగరంలోని దాదాపు ప్రతి మూడు ఇళ్లలో ఒకటి ఇప్పుడు ఏదో ఒక రకంగా పొగాకును వినియోగిస్తోంది.

2011–12లో 14.52 శాతం ఇళ్లలో సిగరెట్ వినియోగం నమోదైంది. 2023-24 నాటికి ఆ సంఖ్య 25.16 శాతానికి పెరిగింది. అంటే ఇప్పుడు ప్రతి నాలుగు ఇళ్లలో ఒకటి సిగరెట్లు తాగుతున్నట్టు లెక్క. నిజానికి హైదరాబాద్లో గత దశాబ్దంలో పొగాకు వినియోగం బాగా పెరిగింది. సిగరెట్ వినియోగం దాదాపు రెట్టింపు అయింది. గుట్కా వినియోగం ఆరు రెట్లు పెరిగింది.
2011-12లో తెలంగాణలోని పట్టణ గృహాల్లో ఏడింటిలో ఒకటి కంటే తక్కువ మంది సిగరెట్ వినియోగాన్ని నివేదించారు. 2023-24 నాటికి ఈ సంఖ్య నాలుగు గృహాల్లో ఒకటి కంటే ఎక్కువకు పెరిగింది. ఆదాయ స్థాయిలతో పాటు సిగరెట్ వినియోగం పెరుగుతుంది. పేద వర్గాలతో పోలిస్తే అధిక ఆదాయం ఉన్న కుటుంబాలు సిగరెట్ వినియోగంలో ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.
తెలంగాణ పట్టణలో గుట్కా వినియోగం బాగా పెరిగిందని సర్వే గుర్తించింది. 2011-12లో పట్టణ గృహాల్లో కేవలం 1.33 శాతం మంది మాత్రమే గుట్కాను ఉపయోగిస్తున్నట్లు నివేదించారు. 2023-24 నాటికి ఈ సంఖ్య 7.46 శాతానికి పెరిగింది. ఇది దాదాపు ఆరు రెట్లు పెరుగుదల. దీని అర్థం ఇప్పుడు దాదాపు 13 కుటుంబాలలో ఒకరు గుట్కాను వినియోగిస్తున్నారు. గుట్కా వంటి ఉత్పత్తులు నోటి, అన్నవాహిక, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లతో సహా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు కారణమవుతాయని నివేదిక హెచ్చరిస్తోంది.
సర్వేలో గుర్తించిన ఒక సానుకూల ధోరణి ఏమిటంటే పట్టణ తెలంగాణలో బీడీ వినియోగం తగ్గింది. బీడీ వినియోగం 2011-12లో 4.87 శాతం నుండి 2023-24లో 3.13శాతానికి పడిపోయింది. కానీ ఈ తగ్గుదల మొత్తం పొగాకు వినియోగం తగ్గుదలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. వినియోగదారులు బీడీల నుండి సిగరెట్లు, గుట్కా వంటి ఉత్పత్తులవైపు మళ్లుతున్నారు.
పేద కుటుంబాలలో పొగాకు వినియోగం ఎక్కువగానే ఉంటుంది. పేద కుటుంబాలు తమ నెలవారీ ఖర్చులో ఎక్కువ భాగాన్ని పొగాకు ఉత్పత్తుల కోసం ఖర్చు చేస్తున్నారు. విశ్లేషణ ప్రకారం దిగువన ఉన్న 40 కుటుంబాలు తమ నెలవారీ తలసరి ఖర్చులో దాదాపు 4 శాతం పాన్, పొగాకు, మత్తు పదార్థాలపై ఖర్చు చేస్తాయి. పొగాకు ఉత్పత్తులతో క్యాన్సర్ లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చి.. చాలా మంది ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పొగాకు వినియోగం తగ్గిన ఏకైక రాష్ట్రంగా కేరళ ఉంది. బీడీ, సిగరెట్, పొగాకు వినియోగం ఇక్కడ తగ్గింది, గుట్కా వినియోగం చాలా తక్కువగా ఉంది. బలమైన విధానపరమైన చర్యలు, నిరంతర ప్రజా అవగాహన ప్రచారాలు పెరుగుతున్న పొగాకు వినియోగాన్ని అరికట్టడంలో సహాయపడతాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


