మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మెున్నటికి మెున్న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల 60 మంది సహచరులతో కలిసి లొంగిపోయారు. తాజాగా అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, రూపేష్ ఛత్తీస్ఘడ్ పోలీసులు ఎదట లొంగిపోయారు. ఆశన్న సహా 208 మంది మావోయిస్టులు పోలీసులకు ఆయుధాలు అప్పగించారు.

మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇదే పెద్ద లొంగుబాటుగా చెబుతున్నారు. లొంగిపోయిన వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. 153 తుపాకులు, 19 ఏకే 47 రైఫిళ్లు, 17 ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, 23 ఇన్సాస్లు, 1 ఇన్సాస్ ఎల్ఎంజీ, 303 రైఫిళ్లు, 11 బీజీఎల్, నాలుగు కార్బైన్లు, 41 బోర్ షాట్ గన్స్, పిస్తోళ్లను పోలీసులకు అప్పజెప్పారు.
అయితే ఆశన్న పేరు చాలా కీలక దాడుల్లో వినిపించింది. ఆయన వ్యూహం వేస్తే పక్కాగా జరిగేదని కొందరు చెబుతుంటారు. సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డిలపై బాంబులు పేల్చి హత్యాయత్నం చేసినప్పుడు ఆశన్న పేరు ఎక్కువగా వినిపించింది. అంతేకాదు ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్ర హత్య, అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి హత్య ఘటనల్లోనూ ఆశన్న ఉన్నారని ఇప్పటికీ పలువురు చెబుతుంటారు.
ఆశన్నది ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. 40 ఏళ్ల కిందట ఉద్యమం వైపునకు ఆకర్శితులు అయ్యారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత కాజీపేటలో సెకండరీ విద్య, కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. ఈ సమయంలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆర్ఎస్యూ కోసం ఆశన్న చాలా కాలం పని చేశారు. తర్వాత నిర్బంధం పెరగడంతో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మావోయిస్టు పార్టీలో ఆయన కీలక బాధ్యతలు చూసుకున్నారు.
లొంగిపోయేముందు ఆశన్న భావోద్వేగ సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. క్లిష్ట పరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. తమ సహచరులు కొందరు ఇంకా పోరాటం చేయాలనుకుంటున్నట్టుగా వెల్లడించారు. భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని సహచరులు కోరుతున్నారన్నారు.
{{/usCountry}}లొంగిపోయేముందు ఆశన్న భావోద్వేగ సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. క్లిష్ట పరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. తమ సహచరులు కొందరు ఇంకా పోరాటం చేయాలనుకుంటున్నట్టుగా వెల్లడించారు. భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని సహచరులు కోరుతున్నారన్నారు.
{{/usCountry}}ముందుగా రక్షణ చాలా అవసరం అని, సమాజ ప్రధాన స్రవంతిలోకి రావాల్సిన సమయం వచ్చిందని చెప్పారు ఆశన్న. అడవులు, ఇతర రాష్ట్రాల్లోని మావోయిస్టులు లొంగిపోవాలని అనుకుంటే తనతోపాటు చేరేందుకు సంప్రదించాలని పిలుపుచ్చారు.