...
...
Next Story

హరిత హోటళ్లకు స్టార్ హోటల్ ప్రమాణాలు: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ

హరిత హోటళ్లను స్టార్ హోటల్ ప్రమాణాలు తగ్గట్టుగా తయారు చేస్తోంది తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ. పెద్ద ఎత్తున ఆధునీకిరించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

Published on: Aug 24, 2026, 14:22:10 IST
Advertisement

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హరిత హోటళ్ల ఆతిథ్య ప్రమాణాలను స్టార్ హోటళ్ల ప్రమాణాలకు దగ్గరగా తీసుకురావాలనే లక్ష్యంతో, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) వాటిని పెద్ద ఎత్తున ఆధునీకరించడానికి ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా ఆహార నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, వసతి, గదుల నిర్వహణ, అతిథి సేవలను మెరుగుపరచడంతోపాటు సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, బుకింగ్ వ్యవస్థలను కూడా ప్రవేశపెట్టనున్నారు.

హరిత హోటళ్లపై టూరిజం కార్పొరేషన్ ఫోకస్
హరిత హోటళ్లపై టూరిజం కార్పొరేషన్ ఫోకస్

అభివృద్ధిలో భాగంగా ఆహార తయారీ, పరిశుభ్రత, సిబ్బంది కార్యకలాపాలను పర్యవేక్షించడానికి అన్ని హరిత హోటల్ యూనిట్ల వంటశాలలలో సీసీటీవీ ఆధారిత ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, లోపాలను వెంటనే సరిదిద్దేలా చూసేందుకు ప్రత్యేక నిఘా బృందాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

టీజీటీడీసీ ఒక ఆటోమేటెడ్ బుకింగ్ వ్యవస్థను కూడా అమలు చేస్తోంది. దీని ద్వారా పర్యాటకులు ఆన్‌లైన్‌లో గదుల లభ్యతను తనిఖీ చేసుకుని, రిజర్వేషన్లు చేసుకోవచ్చు. తద్వారా ఈ ప్రక్రియ మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా మారుతుంది.

టీజీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి పూజారి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హరిత హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. గదులు, రెస్టారెంట్లు, వంటశాలలు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, సిబ్బంది పనితీరు, నిర్వహణ, సేవా ప్రమాణాలను సమీక్షిస్తున్నారు. ఆహార నాణ్యత, వంటగది పరిశుభ్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన తనిఖీ అనంతరం వికారాబాద్‌లోని హరిత హోటల్ యూనిట్ మేనేజర్‌పై శాఖాపరమైన చర్యలు ప్రారంభించింది.

హరిత హోటళ్లను కేవలం సాంప్రదాయ వసతి సౌకర్యాలుగా కాకుండా పర్యాటకులకు మెరుగైన మంచి అనుభూతిని అందించగల ఆధునిక ఆతిథ్య కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని కార్పొరేషన్ తెలిపింది. హరిత హోటళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత, వసతి, సేవలను మెరుగుపరచడం టీజీటీడీసీ ప్రాధాన్యతలలో ఒకటని గౌతమి పూజారి అన్నారు. తెలంగాణ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్నందున హోటళ్లలోని ఆతిథ్య ప్రమాణాలు కూడా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe