జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నామినేషన్ల నేపథ్యంలో అక్టోబర్ 17న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. అక్టోబర్ 17న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.

యూసఫ్గూడ, కృష్ణ నగర్, సమీప ప్రాంతాలలో అనేక రాజకీయ ర్యాలీలు, ఊరేగింపులు జరిగే అవకాశం ఉంది. దీని కారణంగా వాహనాల మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నారు.
యూసఫ్గూడ, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, కృష్ణ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక రాజకీయ పార్టీలు ర్యాలీలు, ఊరేగింపులు ఉంటాయి. అటువైపుగా వెళ్లొద్దని చెప్పారు అధికారులు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
దీని ప్రకారం మైత్రీవనం జంక్షన్ నుండి యూసఫ్గూడ బస్తీ, రహమత్నగర్, కార్మికనగర్, బోరబండ వైపు వెళ్లే వాహనాలను కృష్ణకాంత్ పార్క్ - జీటీఎస్ టెంపుల్ - కళ్యాణ్ నగర్ - మోతీ నగర్ - బోరబండ బస్టాప్ మీదుగా మళ్లిస్తారు.
అదేవిధంగా యూసఫ్గూడ చెక్పోస్ట్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వచ్చే ట్రాఫిక్ను యూసఫ్గూడ బస్తీ వద్ద ఆర్బీఐ క్వార్టర్స్ - కృష్ణా నగర్ జంక్షన్ - జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు మళ్లిస్తారు.
జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, వెంకటగిరి నుండి స్టేడియం వైపు వెళ్లే వాహనాలను కృష్ణ నగర్ జంక్షన్ వద్ద శ్రీనగర్ కాలనీ - పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.
బోరబండ బస్టాప్ నుండి యూసఫ్గూడ వైపు వచ్చే ట్రాఫిక్ను ప్రైమ్ గార్డెన్ ఫంక్షన్ హాల్, శ్రీ రామ్ నగర్ ఎక్స్ రోడ్స్ వద్ద మిడ్ల్యాండ్ బేకరీ - జీటీఎస్ కాలనీ - కళ్యాణ్ నగర్ జంక్షన్ - వెంగళరావు నగర్ - ఉమేష్ చంద్ర విగ్రహం - మైత్రివనం జంక్షన్ వైపు మళ్లిస్తారు.
పంజాగుట్ట నుండి శ్రీనగర్ కాలనీ మీదుగా కృష్ణ నగర్ వెళ్లే వాహనాలను శ్రీనగర్ కాలనీ పార్క్ వద్ద ఎంజే కాలేజ్ రోడ్ - ఎస్ఎన్టీ జంక్షన్ - ఎన్ఎఫ్సీఎల్ వైపు మళ్లిస్తారు.
{{/usCountry}}పంజాగుట్ట నుండి శ్రీనగర్ కాలనీ మీదుగా కృష్ణ నగర్ వెళ్లే వాహనాలను శ్రీనగర్ కాలనీ పార్క్ వద్ద ఎంజే కాలేజ్ రోడ్ - ఎస్ఎన్టీ జంక్షన్ - ఎన్ఎఫ్సీఎల్ వైపు మళ్లిస్తారు.
{{/usCountry}}ట్రాఫిక్ మళ్లింపులు వాహనదారులు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. కార్ల పార్కింగ్ కోసం స్థలం యూసఫ్గూడ మెట్రో పార్కింగ్ (జానకమ్మ తోట 1, 2) వద్ద, సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్ వద్ద అందుబాటులో ఉంటుంది.
మెుత్తానికి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ప్రాంతానికి ప్రయాణికులు దూరంగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.