Hyderabad Traffic Advisory : హైదరాబాద్ నగరం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకొనే ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో అమ్మవారి తిరు కల్యాణోత్సవం, రథోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ ఉత్సవాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సాధారణ ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలగకుండా చూసేందుకు, నగరంలో వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల భద్రతను కాపాడటం మరియు ట్రాఫిక్ జామ్లను నివారించడమే లక్ష్యంగా జూలై 21(ఇవాళ), జూలై 22(రేపు) తేదీలలో ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
వాహనాల మళ్లింపు వివరాలు :
ఉత్సవాలు జరిగే రోజుల్లో బల్కంపేట పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించే వాహనదారులు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది.
- గ్రీన్ ల్యాండ్స్, సత్యం థియేటర్ మీదుగా ఎస్.ఆర్.నగర్ వైపు వెళ్లే వాహనాలను బి.కె.గూడ మీదుగా సనత్ నగర్, ఫతే నగర్ వైపు మళ్లిస్తారు.
- ఫతే నగర్ ఫ్లైఓవర్ మీదుగా వచ్చే వాహనాలను న్యూ బ్రిడ్జ్, ఆర్.యు.బి (రైల్వే అండర్ బ్రిడ్జ్) మీదుగా బేగంపేట వైపు పంపిస్తారు.
- ఫుడ్ వరల్డ్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను సోనాబాయి టెంపుల్, మైత్రివనం మీదుగా ఎస్.ఆర్.నగర్ వైపు మళ్లిస్తారు.
- బేగంపేట వైపు నుంచి వచ్చే వాహనదారులు బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్, మైత్రివనం మార్గాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
- ఎస్.ఆర్.నగర్ టి జంక్షన్ ప్రాంతంలో ఉన్న ఫతే నగర్ ఉప రహదారులు (బై-లేన్స్) అన్నింటినీ పూర్తిగా మూసివేస్తారు.
భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు :
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాలను నిలపడానికి పోలీసులు క్రింది ప్రాంతాలలో పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు:
- ఆర్ అండ్ బి ఆఫీస్ ఆవరణ
- జీహెచ్ఎంసీ మైదానం
- పద్మశ్రీ అపార్ట్మెంట్స్ పరిసరాలు (డి.కె. రోడ్)
- ఫతే నగర్ అండర్ బ్రిడ్జ్ క్రింది భాగం
- నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆవరణ
- సనత్ నగర్లోని జిహెచ్ఎంసి ప్లేగ్రౌండ్
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాలను నిలపడానికి పోలీసులు క్రింది ప్రాంతాలలో పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు:
- ఆర్ అండ్ బి ఆఫీస్ ఆవరణ
- జీహెచ్ఎంసీ మైదానం
- పద్మశ్రీ అపార్ట్మెంట్స్ పరిసరాలు (డి.కె. రోడ్)
- ఫతే నగర్ అండర్ బ్రిడ్జ్ క్రింది భాగం
- నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆవరణ
- సనత్ నగర్లోని జిహెచ్ఎంసి ప్లేగ్రౌండ్
పండుగ వేళ బల్కంపేట వైపు వెళ్లే ప్రధాన రహదారుల్లో వాహనాల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున, సాధారణ ప్రయాణికులు మరియు వాహనదారులు బాల్కంపేట మార్గంలో ప్రయాణించకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని స్పష్టం చేశారు.