...
...
Next Story

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ‘ట్రంప్ టవర్స్’: కోకాపేట్‌లో 4,200 కోట్ల మెగా ప్రాజెక్ట్

దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో అత్యంత విలాసవంతమైన ‘ట్రంప్ టవర్స్’ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. ట్రైబెకా డెవలపర్స్, ఐరా రియల్టీ భాగస్వామ్యంలో రూ.4,200 కోట్ల విక్రయాల అంచనాతో ఈ ఐకానిక్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

Published on: Aug 11, 2026, 16:29:31 IST
Advertisement

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన లగ్జరీ రియల్ ఎస్టేట్ బ్రాండ్ 'ది ట్రంప్ ఆర్గనైజేషన్' దక్షిణ భారతదేశంలో తన మొదటి ప్రాజెక్ట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించబోతోంది. కోకాపేట్‌లోని ప్రసిద్ధ గోల్డెన్ మైల్ రోడ్డులో 'ట్రంప్ టవర్స్ హైదరాబాద్' (Trump Towers Hyderabad) పేరిట అత్యంత విలాసవంతమైన రెసిడెన్షియల్ టవర్లను నిర్మించనున్నట్లు ట్రైబెకా డెవలపర్స్ (Tribeca Developers), ఐరా రియల్టీ (Ira Realty) సంస్థలు వెల్లడించాయి.

భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ట్రంప్ ప్రాజెక్ట్

PREMIUMట్రంప్ టవర్స్ ఊహాచిత్రం
ట్రంప్ టవర్స్ ఊహాచిత్రం

ఈ ప్రాజెక్ట్ పలు ప్రత్యేకతలతో రూపుదిద్దుకోనుంది.

అత్యంత ఎత్తైన నిర్మాణం: 65 అంతస్తులతో, 242 మీటర్ల ఎత్తులో రెండు ట్విన్ టవర్లను నిర్మించనున్నారు. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ట్రంప్-బ్రాండెడ్ ప్రాజెక్ట్‌గా

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన లగ్జరీ రియల్ ఎస్టేట్ బ్రాండ్ 'ది ట్రంప్ ఆర్గనైజేషన్' దక్షిణ భారతదేశంలో తన మొదటి ప్రాజెక్ట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించబోతోంది. కోకాపేట్‌లోని ప్రసిద్ధ గోల్డెన్ మైల్ రోడ్డులో 'ట్రంప్ టవర్స్ హైదరాబాద్' (Trump Towers Hyderabad) పేరిట అత్యంత విలాసవంతమైన రెసిడెన్షియల్ టవర్లను నిర్మించనున్నట్లు ట్రైబెకా డెవలపర్స్ (Tribeca Developers), ఐరా రియల్టీ (Ira Realty) సంస్థలు వెల్లడించాయి.

భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ట్రంప్ ప్రాజెక్ట్

PREMIUMట్రంప్ టవర్స్ ఊహాచిత్రం
ట్రంప్ టవర్స్ ఊహాచిత్రం

ఈ ప్రాజెక్ట్ పలు ప్రత్యేకతలతో రూపుదిద్దుకోనుంది.

అత్యంత ఎత్తైన నిర్మాణం: 65 అంతస్తులతో, 242 మీటర్ల ఎత్తులో రెండు ట్విన్ టవర్లను నిర్మించనున్నారు. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ట్రంప్-బ్రాండెడ్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది.

స్కై బ్రిడ్జ్ & ట్రంప్ క్లబ్: ఈ రెండు టవర్లను 28వ అంతస్తు వద్ద ఒక 'సస్పెండెడ్ స్కై బ్రిడ్జ్' ద్వారా అనుసంధానిస్తారు. దీనిపైనే ప్రత్యేకంగా 'ట్రంప్ క్లబ్' ఏర్పాటు చేయనున్నారు.

విస్తీర్ణం: 4 ఎకరాల విస్తీర్ణంలో, దాదాపు 22 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో ఇది నిర్మితమవుతోంది.

ఫ్లాట్ల వివరాలు, ధరలు

ఈ మెగా ప్రాజెక్ట్‌లో 450కి పైగా అత్యంత విలాసవంతమైన నివాసాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 3.5 BHK, 4 BHK అపార్ట్‌మెంట్లతో పాటు డబుల్-హైట్ సింప్లెక్స్ ఫ్లాట్లు ఉంటాయి. ప్రతి ఫ్లాట్‌కు ప్రత్యేకంగా ప్రైవేట్ లిఫ్ట్ లాబీ సౌకర్యం ఉంటుంది.

ధరలు: ఫ్లాట్ల ధరలు రూ. 5.3 కోట్ల నుంచి రూ. 18 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది.

పెంట్‌హౌస్‌లు: మొత్తం 16 పెంట్‌హౌస్‌లు నిర్మిస్తుండగా, అధికారిక విక్రయాలు ప్రారంభం కాకముందే వాటిలో 8 పెంట్‌హౌస్‌లు అమ్ముడవడం విశేషం. ఒకే కొనుగోలుదారు ఏకంగా 4 పెంట్‌హౌస్‌లను బుక్ చేసుకున్నారు.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం దాదాపు రూ. 1,800 కోట్లు కాగా, విక్రయాల ద్వారా రూ. 3,500 కోట్ల నుంచి రూ. 4,200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని డెవలపర్లు అంచనా వేస్తున్నారు. 2026 అక్టోబర్‌లో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నారు.

"ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లలో భారత్ ఒకటి. హైదరాబాద్‌ వంటి డైనమిక్ నగరంలో మా బ్రాండ్‌ను మొదటిసారిగా పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది," అని ది ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ ట్రంప్ పేర్కొన్నారు.

ఎన్‌ఆర్‌ఐల నుంచి భారీ ఆసక్తి

ట్రైబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా మాట్లాడుతూ.. సాధారణంగా ట్రంప్ ప్రాజెక్టులలో ఎన్‌ఆర్‌ఐల (NRI) వాటా 5 నుంచి 10 శాతం ఉంటుందని, అయితే హైదరాబాద్‌లోని ప్రాజెక్ట్‌లో అంతర్జాతీయంగా స్థిరపడిన తెలుగు వారి సంఖ్య ఎక్కువ కాబట్టి ఎన్‌ఆర్‌ఐల కొనుగోళ్లు 25 నుంచి 30 శాతం వరకు ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. వాస్తు నిబంధనలకు అనుగుణంగానే ఈ ఇళ్ల డిజైన్లను రూపొందించినట్లు చెప్పారు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హవా

హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCCs), ఫార్మా కంపెనీల విస్తరణతో లగ్జరీ హౌసింగ్ విభాగంలో ఊహించని డిమాండ్ కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ పరిశోధనా సంస్థ 'లయాసెస్ ఫోరాస్' నివేదిక ప్రకారం, 2025లో కోకాపేట్, నియోపోలిస్, నార్సింగి పరిధిలోని ఏరియాలో దేశంలోనే అత్యధికంగా రూ. 24,341 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు జరిగాయి. గురుగ్రామ్ ప్రాంతాలను కూడా దాటి హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవడం ఇక్కడి విపరీతమైన డిమాండ్‌కు అద్దం పడుతోంది.

ఈ ప్రాజెక్ట్‌తో కలిపి భారతదేశంలో ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రాజెక్టుల సంఖ్య 7కు చేరింది. ఉత్తర అమెరికా వెలుపల అత్యధిక సంఖ్యలో ట్రంప్ బ్రాండ్ ప్రాజెక్టులు ఉన్న దేశంగా భారత్ కొనసాగుతోంది.

All Access.
One Subscription.

Get 360° coverage—from daily headlines
to 100 year archives.

E-Paper
Full
Archives
Full Access to
HT App & Website
Games
 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe