అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మరణంచారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనూరుకు చెందిన కడియాల కోటేశ్వరరావు కూతురు భావన మృతిచెందారు.

అమెరికాలో తెలుగు విద్యార్థుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో తెలుగువారు మరణించిన వార్తలు వచ్చాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరు యువతలు దుర్మరణం పాలయ్యారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
మేఘన, భావన మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. ఎమ్మెస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. తాజాగా మెుత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్ వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో కారు అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మేఘన, భావన మృతి చెందారు.
మేఘన, భావన అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సంతాపం వ్యక్తం చేశారు. క్రిస్మస్ సెలవులు ఉండడంతో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తుండగా కాలిఫోర్నియాలోని రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పడం బాధాకరమని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. తిరుపతిలో ఉన్న ఎంపీ రవిచంద్రకు ఈ విషాదవార్త తెలియగానే నాగేశ్వరరావు, కోటేశ్వరరావులను ఫోన్ ద్వారా పరామర్శించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పారు.
ఇటీవల అగ్నిప్రమాదం
ఇటీవలే అమెరికా బర్మింగ్హామ్లో విషాదం జరిగింది. తెలుగు విద్యార్థులు నివసించే ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. మరణించినవారిలో మేడ్చల్ జిల్లా పోచారానికి చెందిన సహజ రెడ్డి, కూకట్పల్లికి చెందిన మరో విద్యార్థి ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసించేవారు.
{{/usCountry}}ఇటీవలే అమెరికా బర్మింగ్హామ్లో విషాదం జరిగింది. తెలుగు విద్యార్థులు నివసించే ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. మరణించినవారిలో మేడ్చల్ జిల్లా పోచారానికి చెందిన సహజ రెడ్డి, కూకట్పల్లికి చెందిన మరో విద్యార్థి ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసించేవారు.
{{/usCountry}}ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో చిక్కుకున్న విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. విద్యార్థులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేసి.. వారిని రక్షించారు. తీవ్ర గాయాలు అయిన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.