వియత్నాంలోని ఫు క్వోక్ దీవి సమీపంలో శనివారం జరిగిన ఘోర పడవ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన తెలుగు రాష్ట్రాల పర్యాటకులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న బాధితులు, అక్కడ తమ కోసం ఆందోళనగా వేచి చూస్తున్న కుటుంబ సభ్యులను చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

విజయవాడకు చెందిన మహిపాల్ సంఘ్వి జూలై 8న దాదాపు 80 మంది పర్యాటకుల బృందంతో కలిసి వియత్నాం వెళ్లారు. ఆయన తన చేదు అనుభవాన్ని పంచుకుంటూ.. 'మేం జులై 11న ఫు క్వోక్ దీవికి చేరుకున్నాం. మా బృందంలోని కొందరు వాటర్ స్పోర్ట్స్ కోసం వెళ్లగా, నేను ఒడ్డునే ఉండిపోయాను. కొంత సమయం తర్వాత ఒక బోటు ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. సహాయక సిబ్బంది నీటిలో పడిపోయిన వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. మేం వారికి వెంటనే సి.పి.ఆర్ చేసి బతికించడానికి ప్రయత్నించాం, కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వారు కళ్లముందే ప్రాణాలు కోల్పోయారు.' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ టూర్లో మొత్తం 105 మంది సభ్యులు ఉన్నారని రమేశ్వర్ ప్రధాన్ అనే మరో పర్యాటకుడు తెలిపారు. ఫు క్వోక్ దీవి నుండి మరో చిన్న దీవికి వెళ్లేందుకు పర్యాటకులను మూడు బోట్లలో విభజించారు. ప్రమాదానికి గురైన మొదటి బోటులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు.
బయలుదేరిన ఒక కిలోమీటరు దూరంలోనే సముద్రపు అలల ఉధృతికి నియంత్రణ కోల్పోయిన ఆ బోటు ఒక్కసారిగా బోల్తా పడింది. నావికాదళం వెంటనే స్పందించి కొందరిని సురక్షితంగా కాపాడినప్పటికీ, మిగిలిన వారు నీటిలో మునిగిపోయారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారు అక్కడి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని ప్రధాన్ వివరించారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే పర్యాటకుడు మాట్లాడుతూ, తాము 24 మందితో కూడిన వేరే గ్రూప్లో ఉన్నామని, తమ కళ్ల ముందే ముందు వెళ్తున్న బోటు మునిగిపోయిందని చెప్పారు. నీటి ప్రవాహం చాలా బలంగా ఉందని, తాము తృటిలో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నామని పేర్కొన్నారు.
{{/usCountry}}పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే పర్యాటకుడు మాట్లాడుతూ, తాము 24 మందితో కూడిన వేరే గ్రూప్లో ఉన్నామని, తమ కళ్ల ముందే ముందు వెళ్తున్న బోటు మునిగిపోయిందని చెప్పారు. నీటి ప్రవాహం చాలా బలంగా ఉందని, తాము తృటిలో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నామని పేర్కొన్నారు.
{{/usCountry}}ప్రమాదం జరిగిన వెంటనే వియత్నాం నావికాదళంతో పాటు, భారత రాయబార కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించి అవసరమైన సహాయ సహకారాలు అందించాయని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరిన విమానంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు, తెలంగాణకు చెందిన ఎనిమిది మందితో కలిపి మొత్తం 17 మంది పర్యాటకులు తిరిగి వచ్చారు. వియత్నాంలో చిక్కుకున్న మిగిలిన వారిని కూడా సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.