హైదరాబాద్ నగరం వినాయక చవితి పండుగ శోభతో విలసిల్లుతోంది. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి 70 అడుగుల భారీ ఎత్తులో ‘శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి’ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రసిద్ధ ఖైరతాబాద్ గణపతికి తొలి పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకుని తొలి పూజ చేశారు. మెుదట ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ గవర్నర్ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ గవర్నర్ దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు అందించారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.
ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ ఖైరతాబాద్ స్వామివారికి సాంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా పద్మశాలి సంఘం ప్రతినిధులు గణనాథుడి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన భారీ కండువా, సుదీర్ఘమైన యజ్ఞోపవీతాన్ని శోభాయాత్రగా తీసుకొచ్చి అర్చకులకు అందజేశారు.
స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో మహారాష్ట్రలో లోకమాన్య తిలక్ ప్రారంభించిన గణేష్ ఉత్సవాల స్ఫూర్తితో ఖైరతాబాద్లో విగ్రహ ప్రతిష్ఠాపన ప్రారంభమైంది. ఏటికేడు మారుతున్న రూపాలతో, శిల్పకళా వైభవంతో 70 ఏళ్లకు పైగా ఇక్కడ ఉత్సవాలు సాగుతున్నాయి. మట్టి ప్రతిమలతో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలను నిర్వహించడం ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ప్రత్యేకత.
మహాగణపతి దర్శనార్థం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు ఖైరతాబాద్కు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక రూట్ డైవర్షన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాల నిఘాతో పాటు భారీగా పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, మంచినీటి సదుపాయాలు కల్పించారు.
{{/usCountry}}మహాగణపతి దర్శనార్థం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు ఖైరతాబాద్కు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక రూట్ డైవర్షన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాల నిఘాతో పాటు భారీగా పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, మంచినీటి సదుపాయాలు కల్పించారు.
{{/usCountry}}