...
...
Next Story

Warangal UGD Project : రూ. 5,257 కోట్లతో వరంగల్ భూగ‌ర్భ డ్రైనేజీ - వచ్చే నెల నుంచే పనులు..!

Warangal Underground Drainage Project : త్వరలోనే వరంగల్ అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్ డ్రైనేజీ(యూడీఎస్​) ప్రాజెక్ట్ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి… ఏప్రిల్ లో పనులు ప్రారంభించాలని భావిస్తోంది.

Published on: Mar 11, 2026 06:27 PM IST
Advertisement

గ్రేటర్ వరంగల్‌‌‌‌‌‌‌‌ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్ డ్రైనేజీ(యూడీఎస్​) ప్రాజెక్ట్ త్వరగానే పట్టాలెక్కబోతుంది. ఇటీవలనేప్రభుత్వం రూ.5,257.20 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరితగతిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి… పనులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి.

వచ్చే నెలలో పనులు...

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (representative image ) (image source istock)
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (representative image ) (image source istock)

వరంగల్ అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టును 4 ప్యాకేజీలు, 9 జోన్లు, 13 సబ్‌‌‌‌‌‌‌‌జోన్లుగా విభజించి చేపట్టనున్నారు. దశల వారీగా చేపట్టే ఈ పనులు…. వచ్చే రెండు, మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు గ్రేటర్ వరంగల్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో ఈ పనులు చేపడుతారు. రాజస్థాన్‍కు చెందిన ఎన్‍.కే.బిల్డ్​కాన్‍ ప్రైవేట్‍ లిమిటెడ్‍ సంస్థ యూడీఎస్​ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్‍ ఇప్పటికే సిద్ధం చేసింది.

తాజాగా వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… మంత్రి కొండా సురేఖతో కలిసి వరంగల్ నగరాభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా భూగర్బ డ్రైనేజీ ప్రాజెక్ట్ పై కీలక ఆదేశాలిచ్చారు. వరంగల్ నగరంలో 5,257 కోట్ల రూపాయిల‌తో చేప‌ట్టే భూ గ‌ర్భ డ్రైనేజీ ప‌నులకు సంబంధించి వెంట‌నే టెండ‌ర్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వ‌చ్చే నెల‌(ఏప్రిల్)లో ప‌నుల‌ను ప్రారంభించేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.

మూడు దశలలో నిధులను వెచ్చించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా భూగర్భంలో కాలువల వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. అలాగే వర్షపునీటి ప్రవాహం-యాజమాన్య వ్యవస్థ, నీటిసరఫరా, చెరువులు, నీటి వనరుల పునరుజ్జీవం కోసం చర్యలు తీసుకుంటారు. భూగర్భ డ్రైనేజీ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు శరవేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది.

  • గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 5,257.20 కోట్ల అంచనా వ్యయంతో భూగర్భ మురుగునీటి పారుదల (UGD) ప్రాజెక్ట్ - ఫేజ్ 1కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
  • ఈ భారీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర నిధులతో చేపడుతారు.
  • కేంద్ర ప్రభుత్వం వాటాగా 25 శాతం (రూ.1,314.30), రాష్ట్ర ప్రభుత్వం వాటా 25 శాతం (రూ.1,314.30 కోట్లు) ఉండగా… మిగతా 50 శాతం నిధులను బ్యాంకు రుణం లేదా పీపీపీ పద్ధతిలో సమకూర్చుస్తారు.
  • భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులపై కేఎఫ్‌డబ్ల్యూ ఆసక్తి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్‌ను అధ్యయనం చేసింది. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రాథమికంగా అంగీకరించింది.
  • వరంగల్‌లో ఫేజ్‌-1 కింద రూ.5,257.20కోట్లతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవలనే పరిపాలన అనుమతులను మంజూరు చేసింది.
  • ఈ ప్రాజెక్ట్ పూర్తయితే వరంగల్ నగర రూపురేఖలు మారిపోవడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మెరుగైన పారిశుద్ధ్యం అందుబాటులోకి వస్తుంది. సెప్టిక్ ట్యాంకులు , బహిరంగ మురుగు కాలువల అవసరం లేకుండా నేరుగా భూగర్భ పైపుల ద్వారా మురుగునీటి తరలింపు జరుగుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe