హైదరాబాద్ నగరవాసులకు జలమండలి అలర్ట్ ఇచ్చింది. సిటీకి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ సమీపంలో పైప్ లీకేజీ ఏర్పడింది. శ్రీనివాస్ నగర్ బ్రిడ్జి వద్ద 3000 మీమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ కి ఏర్పడిన లీకేజీతో వాటర్ సరఫరాకు బ్రేక్ పడిందని అధికారులు తెలిపారు.
19 గంటల పాటు సరఫరా నిలిపివేత….

పైప్ లీకేజీ కారణంతో 02.01.2026 శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి మరునాడు 03.01.2026 (శనివారం) ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా బంద్ కానుంది. మొత్తం 19 గంటల పాటు ఈ మరమ్మత్తు ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈ 19 గంటలు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఏం డివిజన్–VI: ఎస్.ఆర్. నగర్, సనత్నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగల్రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్ సెక్షన్లు.
2. ఓ అండ్ ఏం డివిజన్–IX: కూకట్పల్లి, భాగ్యనగర్, వివేకానందనగర్, ఎల్లమ్మబండ, మూసాపేట, భారత్నగర్, మోతీనగర్, గాయత్రినగర్, బాబానగర్, కేపీహెచ్బీ, బాలాజీనగర్, హస్మత్పేట్ సెక్షన్.
3. ఓ అండ్ ఏం డివిజన్డి–XII: చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్నగర్, గాజులరామారం, సూరారం, ఆదర్శ్నగర్, భగత్సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ సెక్షన్.
4. ఓ అండ్ ఏం డివిజన్ –XIII: అల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్, వెంకటాపురం, మచ్చబొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్పాయినగర్, యాప్రాల్, చాణక్యపురి, గౌతమ్నగర్, సాయినాథ్పురం సెక్షన్.
5. ఓ అండ్ ఏం డివిజన్ –XIV(కాప్రా మున్సిపాలిటీ): చర్లపల్లి, సాయిబాబానగర్, రాధిక సెక్షన్లు.
6. ఓ అండ్ ఏం డివిజన్–XV: కొండాపూర్, డోయెన్స్, మాధాపూర్లో భాగం.
{{/usCountry}}6. ఓ అండ్ ఏం డివిజన్–XV: కొండాపూర్, డోయెన్స్, మాధాపూర్లో భాగం.
{{/usCountry}}7. ఓ అండ్ ఏం డివిజన్–XVII: హఫీజ్పేట్, మియాపూర్ సెక్షన్లు.
8. ఓ అండ్ ఏం డివిజన్ –XXI: కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, జవహర్నగర్, దమ్మాయిగూడ, నగరం సెక్షన్.
9. ఓ అండ్ ఏం డివిజన్ –XXI : నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం సెక్షన్లు.
10. ట్రాన్స్మిషన్ డివిజన్–IV: ఎంఈఎస్, త్రిశూల్ లైన్లు, గన్రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కాంటోన్మెంట్, ఏఐఐఎంఎస్–బిబినగర్.
11. ఆర్డబ్ల్యూఎస్ ఆఫ్టేక్స్: ఆలేరు (భువనగిరి), ఘనపూర్ (మెద్చల్/షామీర్పేట్) ప్రాంతాలు.
నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటి వాడకంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ముందస్తు ప్రకటన నేపథ్యంలో… తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.