ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రతీవారం బిల్లులు మంజూరు చేస్తాం : భట్టి విక్రమార్క
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రతీవారం బిల్లు మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.
రామగుండం కార్పొరేషన్లో రూ.175 కోట్ల విలువైన పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని భట్టి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిందన్నారు. ఈ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా వెల్లడించారు. స్థలం ఉన్నవారు.. ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షలు అందజేస్తోందని చెప్పారు. ప్రతీవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు మంజూరు చేస్తామన్నారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే కొద్దీ నిధులు మంజూరు చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు విడతలవారీగా విడుదల చేయనున్నట్టుగా స్పష్టం చేశారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. రామగుండం అభివృద్ధి కోసం, ప్రజల అవసరాల కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎల్లప్పుడూ పని చేస్తారని పేర్కొన్నారు.
'రామగుండంలో 800 మెగావట్ల థర్మల్ పవర్ ప్లాంట్ కోసం చర్యలు చేపడుతున్నాం. కొద్ది రోజుల్లోనే పవర్ ప్రాజెక్టు ప్రకటన చేస్తాం. రాజకీయ అవసరాల కోసం ప్రజలను అయోమయానికి గురి చేయవద్దు. రామగుండం ప్రాంతంలోని పరిశ్రమలు అందరికి ఉపయోగపడుతున్నాయి. రామగుండంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రాజెక్టులే తప్ప బీఆర్ఎస్ చేసింది ఏం లేదు.' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
సింగరేణి కాలరీస్ అనేది అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అని భట్టి విక్రమార్క చెప్పారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సింగరేణి మైనింగ్ కేవలం బొగ్గు ఉత్పత్తిలోనే కాదని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు కోటి రుపాయల ప్రమాద బీమా కల్పించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. రామగుండం అభివృద్ధి ప్రత్యేక నిధులు కేటాయించి.. పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తామన్నారు.
'గతంలో బీఆర్ఎస్ హయాంలో పురుగుల బియ్యం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నబియ్యం అందిస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


