...
...
Next Story

బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురు అరెస్టు!

హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఓ లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌.. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయించడాన్ని గుర్తించారు.

Published on: Dec 24, 2025, 17:34:35 IST
Advertisement

హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW), చిక్కడపల్లి పోలీసులతో కలిసి డిసెంబర్ 24, 2025 బుధవారం నగరంలోని చిక్కడపల్లిలో ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌తో సహా ముగ్గురు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వారిరి అరెస్టు చేశారు. ఒక కస్టమర్‌ను కూడా ఈ సందర్బంగా అదుపులోకి తీసుకున్నారు.

డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్
డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్

ఈ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కార్యకలాపాల గురించి విశ్వసనీయ సమాచారం మేరకు అరెస్టులు జరిగాయని పోలీసులు తెలిపారు. పోలీసులు 22 గ్రాముల OG (హైడ్రోపోనిక్ గంజాయి), MDMA, 5.57 గ్రాముల ఎక్స్‌టసీ మాత్రలు, ఆరు LSD బ్లాట్‌లు, రూ.50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌తో కలిపి మెుత్తం విలువ రూ.3,12,980 ఉంటుందని అంచనా.

నిందితులను ఉమ్మిడి ఇమ్మానుయేల్ (25), ఈవెంట్ మేనేజర్‌గా గుర్తించారు. చోడవరపు సుస్మితా దేవి అలియాస్ లిల్లీ (21), సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. గొర్ల సాయి కుమార్ (28) డెలివరీ బాయ్. ముగ్గురూ కొండాపూర్‌లో ఉంటున్నట్టుగా తెలిసింది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. వినియోగదారుడు చిక్కడపల్లికి చెందిన తాలబత్తుల తారక లక్ష్మీకాంతం(24)గా గుర్తించారు.

విచారణలో ఇమ్మాన్యుయేల్ తాను మొదట్లో మాదకద్రవ్యాలకు బానిసయ్యానని, తరువాత తన వ్యసనాన్ని కొనసాగించడానికి డ్రగ్స్ సరఫరాలోకి దిగినట్టుగా వెల్లడించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన పలు కేసులలో నిందితుడిగా ఉన్నాడు. నేరుగా సరఫరాదారుల నుండి, తరువాత డార్క్ వెబ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డ్రగ్స్‌ను సేకరించాడు. క్రిప్టోకరెన్సీ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేసేవాడని తెలిసింది.

నిందితులు కొరియర్ సేవల ద్వారా డ్రగ్స్‌ను స్వీకరించి హైదరాబాద్ అంతటా అధిక ధరలకు విక్రయించారు. ఇమ్మాన్యుయేల్ లేనప్పుడు, అతని ప్రియురాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సుస్మితా దేవి ఈ కార్యకలాపాలను నిర్వహించారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ను డెలివరీ బాయ్‌ అయిన గొర్ల సాయి కుమార్ సరఫరా చేసేవాడు. తన బ్యాంక్ ఖాతాను ఉపయోగించి ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలను నిర్వహించినట్లు సుస్మితా అంగీకరించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe