హైదరాబాద్ ఉప్పల్ స్కైవాక్ లిఫ్టులో ఇరుక్కున్న యువకుడు... పాపం 2 గంటలపాటు నరకం!
హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతం ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇక్కడ స్కైవాక్ నిర్మించారు. దానికి లిఫ్ట్ కూడా ఉంది. ఈ లిఫ్ట్లో ఓ యువకుడు ఇరుక్కుని రెండుగంటలు నరకం చూశాడు.
హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ స్కైవాక్ వద్ద గురువారం రాత్రి ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. స్కైవాక్ పైనుంచి కిందకు దిగుతున్న క్రమంలో సాంకేతిక లోపంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో, ఒక యువకుడు దాదాపు రెండు గంటల పాటు లోపలే చిక్కుకుపోయి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. నిజం చెప్పాలంటే నరకం చూశాడు అనుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు నిర్మించిన ఈ స్కైవాక్ వద్ద నిర్వహణ లోపాలు ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయనే దానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్లోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్లో రాహుల్ అనే 20 ఏళ్ల వ్యక్తి ఉంటున్నాడు. ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రాహుల్ గురువారం రాత్రి తన డ్యూటీ ముగించుకుని హాస్టల్కు తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ఉప్పల్ ఎక్స్రోడ్డు వద్ద ఉన్న స్కైవాక్ ఎక్కాడు. అనంతరం రోడ్డు దాటిన తర్వాత కిందికి దిగడం కోసం స్కైవాక్ లిఫ్ట్ను ఉపయోగించాడు.
అయితే, లిఫ్ట్ కిందకు వస్తున్న సమయంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తి, అది మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో ఆ యువకుడు లిఫ్ట్ లోపలే చిక్కుకుపోయాడు. గాలి ఆడక, లోపల చీకటిగా మారడంతో రాహుల్ తీవ్ర భయాందోళనతో కేకలు వేశాడు. చాలాసేపు నరకం చూశాడు.
లిఫ్టులో యువకుడు చిక్కుకున్న విషయమై సమాచారం అందుకున్న వెంటనే ఉప్పల్ పోలీసులు, హైడ్రా అధికారులు మరియు అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోపల ఉన్న యువకుడికి ధైర్యం చెబుతూనే, లిఫ్ట్ తలుపులు తెరిచేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ అనంతరం.. అర్ధరాత్రి దాటాక సుమారు 1:15 గంటల సమయంలో ఒక టెక్నీషియన్ సహాయంతో లిఫ్ట్ డోర్లను విజయవంతంగా తెరిచారు. రాహుల్ను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ మెయింటెనెన్స్ బాధ్యతలు చూసే కృష్ణ కన్స్ట్రక్షన్స్ సిబ్బందితో పాటు హెచ్ఎండీఏ అధికారులు సకాలంలో స్పందించలేదని ఆరోపణలు వస్తున్నాయి. వారి నిర్లక్ష్యం వల్లే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైందని, యువకుడు ఎక్కువ సమయం నరకయాతన అనుభవించాల్సి వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే స్కైవాక్ లిఫ్టుల భద్రతపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


