...
...
Next Story

అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టుకు వైసీపీ అధినేత జగన్! దాదాపు ఆరేళ్ల తర్వాత!

అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(వైఎస్ఆర్సీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. సుమారు ఆరు సంవత్సరాల తర్వాత ఆయన కోర్టు ఎదుట వచ్చారు.

Updated on: Nov 20, 2025 01:05 PM IST
Advertisement

అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోనీ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. ఉదయంపూట విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలితారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టు వరకు ర్యాలీగా వెళ్లారు. కొంతమంది అభిమానులు, కార్యకర్తలు అత్యుత్సాహం చూపించారు. దీంతో కొన్ని ప్రదేశాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా వచ్చాయి.

నాంపల్లి కోర్టుకు జగన్
నాంపల్లి కోర్టుకు జగన్

జగన్ రాకను దృష్టిలో ఉంచుకుని నాంపల్లి కోర్టు పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సుమారు ఆరు సంవత్సరాల తర్వాత జగన్ కోర్టుకు హాజరు అయ్యారు. నాంపల్లి కోర్టుకు ఉదయం 11.40 గంటలకు వచ్చి.. పన్నెండున్నర దాకా ఉండి వెళ్లిపోయారు. జగన్‌తో వచ్చిన కొంతమంది ముఖ్యనేతలను లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో గేటు వద్దే ఉన్నారు. మొత్తం 11 ఛార్జ్ షీట్లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా జగన్ ఉన్నారు.

కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత అక్కడ నుంచి నుంచి జగన్ లోటస్ పాండ్‌కు వెళ్లారు. చాలా రోజుల తర్వాత అక్కడకు చేరుకున్నారు. కొందరు నేతలను కలిసి ఆ తర్వాత బేగంపేట చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్తారు. చివరిసారిగా వైఎస్ జగన్ 2020 మెుదట్లో నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు అయ్యారు. సుమారుగా ఆరేళ్లు అవుతుంది. తాజాగా మళ్లీ కోర్టుకు వచ్చారు.

కొన్ని రోజుల కిందట కోర్టు అనుమతితో యూరప్ వెళ్లారు జగన్. వచ్చిన తర్వాత హాజరుకావాలని కోర్టు ఆదేశించిగా మినహాయింపు కావాలని పిటిషన్ వేశారు. కానీ దీనిపై సీబీఐ అభ్యంతరం తెలిపింది. దీంతో కోర్టుకు తప్పక హాజరు కావాల్సి వచ్చింది. ఆరేళ్లుగా జగన్ కోర్టుకు హాజరుకావడంలేదని, డిశ్ఛార్జి పిటిషన్లపై రోజూవారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరుకావాలని సీబీఐ వెల్లడించింది. దీంతో ఈ నెల 21వ తేదీలోగా హాజరు కావాలని కోర్టు ఆదేశించగా.. ఒకరోజు ముందుగానే జగన్ కోర్టుకు వచ్చారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe