అక్టోబర్ 27 నుంచి భోగాపురం-బ్యాంకాక్ మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారానికి రెండుసార్లు విమాన సర్వీసును ప్రారంభించనుంది. ఈ ప్రాంతానికి ఇది ఒక కీలక మలుపు అని విమాన ప్రయాణికులు అభివర్ణిస్తున్నారు. భోగపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అక్టోబర్ 27న ఈ సర్వీసు ప్రారంభం అవుతుంది.

సంవత్సరాల తరబడి చేసిన కృషి ఫలితంగా ఆ తేదీ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ భోగాపురాన్ని బ్యాంకాక్తో కలుపుతూ నేరుగా సర్వీసులను నడపనుంది. పెద్ద ఫార్మాస్యూటికల్ రంగం, ఒక ప్రధాన ఓడరేవు, అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్లు, సముద్రపు ఆహార ఎగుమతి మార్కెట్ ఉన్నప్పటికీ.. విశాఖపట్నానికి అంతర్జాతీయ కనెక్టివిటీ ఒక పెద్ద అడ్డంకిగా ఉంది. విదేశాలకు కనెక్టింగ్ ఫ్లైట్లు అందుకోవడానికి ప్రయాణికులు, వ్యాపార ప్రతినిధులు సాధారణంగా హైదరాబాద్, చెన్నై లేదా న్యూఢిల్లీ లాంటి వాటిపై ఆధారపడవలసి వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ నిరంతర విజ్ఞప్తుల ఫలితంగా ఈ సర్వీసు ప్రారంభమవుతోంది. ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల. విశాఖపట్నాన్ని థాయిలాండ్ రాజధానితో అనుసంధానించడం ద్వారా ఈ మార్గం పలు ఆర్థిక రంగాలకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
విడుదలైన విమాన షెడ్యూల్ ప్రకారం, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారానికి రెండుసార్లు ఈ సర్వీసును నడుపుతుంది. ఫ్లైట్ IX 904 ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు బ్యాంకాక్లో దిగుతుంది. తిరుగు ప్రయాణ విమానం, IX 903 బుధవారాలు, శనివారాలు తెల్లవారుజామున బ్యాంకాక్ కాలమాన ప్రకారం.. 2.10 గంటలకు బ్యాంకాక్ నుండి బయలుదేరి, భారత కాలమాన ప్రకారం.. తెల్లవారుజామున 3.55 గంటలకు విశాఖపట్నంలో చేరుకుంటుంది. ప్రారంభ వన్-వే ఎకానమీ ఛార్జీలు రూ.16,300 నుండి రూ.19,400 మధ్య ఉండటంతో, ఈ ఫ్లైట్స్ వారాంతపు విహార యాత్రికులకు, కార్పొరేట్ ప్రయాణికులకు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది.
థాయ్ బీచ్లు లేదా బౌద్ధ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకునే వారికి ఈ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. విశాఖపట్నం సముద్రపు ఆహార ఎగుమతిదారులతోపాటుగా వేగవంతమైన కార్గో రవాణా ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ మార్గం మెడికల్ టూరిజానికి కూడా కొత్త మార్గాలను తెరుస్తుంది. ఇది ఆగ్నేయాసియా నుండి రోగులను ఉత్తర ఆంధ్రలోని విస్తరిస్తున్న ఆసుపత్రులకు తీసుకురావడంతో పాటు, ప్రాంతీయ నిపుణుల విదేశీ ప్రయాణాలను కూడా సులభతరం చేస్తుంది.
{{/usCountry}}థాయ్ బీచ్లు లేదా బౌద్ధ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకునే వారికి ఈ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. విశాఖపట్నం సముద్రపు ఆహార ఎగుమతిదారులతోపాటుగా వేగవంతమైన కార్గో రవాణా ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ మార్గం మెడికల్ టూరిజానికి కూడా కొత్త మార్గాలను తెరుస్తుంది. ఇది ఆగ్నేయాసియా నుండి రోగులను ఉత్తర ఆంధ్రలోని విస్తరిస్తున్న ఆసుపత్రులకు తీసుకురావడంతో పాటు, ప్రాంతీయ నిపుణుల విదేశీ ప్రయాణాలను కూడా సులభతరం చేస్తుంది.
{{/usCountry}}అక్టోబర్ 27 సమీపిస్తున్న తరుణంలో భోగాపురం నుండి నడవనున్న అంతర్జాతీయ విమాన సర్వీసు ఒక కీలక మలుపుగా నిలుస్తుంది. విశాఖపట్నం ఇకపై కేవలం ఒక ప్రాంతీయ స్థాయి కేంద్రం మాత్రమే కాదు.. ప్రపంచ విమానయాన చిత్రపటంలో పేరు సంపాదించుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.