AP Weather Update : ఏపీ మీదుగా ద్రోణి ప్రభావం - మోస్తరు నుంచి భారీ వర్ష సూచన..!
AP Weather Updates: ఏపీ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా రాగల కొన్ని గంటల్లో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రం మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది .

ఏపీకి వర్ష సూచన….
ఆదివారం(జూన్ 21) నాటి వాతావరణ అంచనాల ప్రకారం….. రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడా చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడొచ్చు.
మరికొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో కూడా పిడుగులు పడే అవకాశంతో పాటు తేలికపాటి వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వర్షం కురిసే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాగల మూడు గంటల్లో వర్షం - హెచ్చరికలు జారీ:
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి రాగల మూడు గంటల కాలానికి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక అలర్ట్లను జారీ చేసింది.
- ఆరెంజ్ అలెర్ట్ : పార్వతీపురం మన్యం జిల్లాలో రాగల మూడు గంటల్లో అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు స్పష్టం చేశారు.
- ఎల్లో అలెర్ట్ : శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాలలో రాగల మూడు గంటల వ్యవధిలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ జిల్లాల్లోని ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండొద్దన అధికారులు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

