ప్రజా రవాణా అందుబాటు ధరలో సమర్థవంతంగా ఉండాలని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయంలో రోడ్లు, హైవేలను సమీక్షిస్తూ, స్వచ్ఛమైన ఇంధన వినియోగం నిర్వహణ ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుందన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమర్థవంతమైన సౌర విద్యుత్ నిర్వహణ ఇప్పటికే విద్యుత్ కొనుగోలు ఖర్చులను యూనిట్కు సుమారు రూ.1 మేర తగ్గించిందని, ఇంధన వ్యయ ఆప్టిమైజేషన్ను మరింతగా కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఎలక్ట్రిక్ బస్సులు

'ప్రస్తుతం ఈవీ బస్సుల నిర్వహణ ఖర్చు కిలోమీటరుకు సుమారు రూ.72గా ఉంది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, బ్యాటరీ వ్యవస్థలను ప్రామాణీకరించడంపై దృష్టి సారించి, ఖర్చులను మరింత తగ్గించేందుకు మార్గాలను అన్వేషించాలి. అన్ని రకాల బస్సులను క్రమంగా ఏసీ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని, ప్రజల్లో అవగాహన ద్వారా ఈ-సైకిళ్లను ప్రజా రవాణా ఎంపికగా ప్రోత్సహించాలి.' అని చంద్రబాబు అన్నారు.
ఉత్తమ పద్ధతులు పాటించాలి
ఆర్థిక కార్యకలాపాలను పెంచేందుకు జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, నిర్వహణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓడరేవులకు రహదారులను అనుసంధానించడం, ఆంధ్రప్రదేశ్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలపడం ప్రాముఖ్యతపై మాట్లాడారు.
రాష్ట్రంలోని 45,433 కిలోమీటర్ల రహదారులలో సుమారు 10,238 కిలోమీటర్లకు వార్షిక నిర్వహణ అవసరమని చంద్రబాబు అన్నారు. గుంతలను వెంటనే పూడ్చాలని ఆదేశించారు. అలాగే రహదారులు, భవనాల పనులకు తగిన నిధులు అందేలా చూస్తూనే.. జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అనుసరించాలని చెప్పారు.
రోడ్ల మరమ్మతులపై ఆదేశాలు
రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, గోదావరి, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో రహదారి మరమ్మతు పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేవలం గోదావరి ప్రాంతంలోనే రూ.400 కోట్ల వ్యయంతో 531 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయనున్నారు. కుంభమేళా తరహాలో కేంద్రం నుండి ప్రత్యేక నిధులను కోరాలని కూడా అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, మూలపేటతో సహా అన్ని ప్రధాన ఓడరేవులను జాతీయ రహదారుల నెట్వర్క్తో అనుసంధానించాల్సిన ఆవశ్యకతను చంద్రబాబు నొక్కి చెప్పారు.
రవాణా ఖర్చులను తగ్గించడానికి తూర్పు-పశ్చిమ కారిడార్లను అభివృద్ధి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దాదాపు 73 శాతం సరకు రవాణా రోడ్డు మార్గంలోనే జరుగుతోందని పేర్కొన్నారు. మెరుగైన అనుసంధానం పారిశ్రామిక, ఉద్యానవన రంగాల వృద్ధిని వేగవంతం చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ను కీలక ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుందని ఆయన అన్నారు.
రాబోయే కీలక ప్రాజెక్టులు
{{/usCountry}}రవాణా ఖర్చులను తగ్గించడానికి తూర్పు-పశ్చిమ కారిడార్లను అభివృద్ధి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దాదాపు 73 శాతం సరకు రవాణా రోడ్డు మార్గంలోనే జరుగుతోందని పేర్కొన్నారు. మెరుగైన అనుసంధానం పారిశ్రామిక, ఉద్యానవన రంగాల వృద్ధిని వేగవంతం చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ను కీలక ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుందని ఆయన అన్నారు.
రాబోయే కీలక ప్రాజెక్టులు
{{/usCountry}}ప్రధాన నగరాల చుట్టూ రింగ్ రోడ్ల ఆవశ్యకతను ముఖ్యమంత్రి చంద్రబాబు నొక్కి చెప్పారు. ఖరగ్పూర్-అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే, హైదరాబాద్–శ్రీశైలం–దోర్నాల హైవే, కల్వకుర్తి–నంద్యాల హైవే వంటి రాబోయే కీలక ప్రాజెక్టులను ప్రస్తావించారు. రెండు సంవత్సరాలలో సుమారు 1,335 కిలోమీటర్ల జాతీయ రహదారులను పూర్తి చేయాలని అంచనా వేయగా, రూ.24,502 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.