Tata Safari EV : దీపావళికి ముందే రోడ్డెక్కనున్న టాటా సఫారీ ఈవీ.. సింగిల్ ఛార్జ్తో 600 కి.మీ రేంజ్!
Electric cars in India : టాటా మోటార్స్ తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ సఫారీని ఎలక్ట్రిక్ వెర్షన్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. 2026 ఆగస్టులో ఉత్పత్తి ప్రారంభించి, దీపావళి నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇది మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్కి గట్టి పోటీ ఇవ్వనుంది. పూర్తి వివరాలు..
టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత విస్తరిస్తూ, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘సఫారీ ఈవీ’ని భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. తాజా నివేదికల ప్రకారం.. ఈ కొత్త మోడల్ 2026 దీపావళి పండుగ సీజన్ కంటే ముందే విడుదల కానుంది. టాటా బ్రాండ్ నుంచి వస్తున్న మొట్టమొదటి 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీగా ఇది రికార్డు సృష్టించబోతోంది. ప్రస్తుతం టాటా ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ కారుగా ఉన్న హారియర్ ఈవీ స్థానాన్ని ఇకపై సఫారీ ఈవీ భర్తీ చేస్తుంది. ఈ కారు ప్రొడక్షన్ ప్రక్రియను 2026 ఆగస్టు నాటికి ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

టాటా సఫారీ ఈవీ- ప్లాట్ఫామ్, పవర్ట్రెయిన్ వివరాలు..
అంతర్గతంగా 'టైరోనా' అనే కోడ్ నేమ్తో పిలుస్తున్న ఈ సఫారీ ఈవీ, హారియర్ ఈవీలో ఉపయోగించిన 'acti.ev+' ఆర్కిటెక్చర్పైనే ఆధారపడి ఉంటుంది. ఇది పూర్తిస్థాయి 'బోర్న్-ఈవీ' కాకపోయినప్పటికీ, ఐసీఈ నుంచి ఈవీగా మార్చిన అధునాతన ప్లాట్ఫామ్.
ఇక ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది:
65 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది సుమారు 538 కి.మీ రేంజ్ (ఆర్డబ్ల్యూడీ) ఇవ్వగలదు.
75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: దీని ద్వారా దాదాపు 600 కి.మీ పైగా రేంజ్ లభించవచ్చు.
స్టాండర్డ్ మోడల్స్లో రియర్-యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ (ఆర్డబ్ల్యూడీ) ఉండగా, హై-స్పెక్ వేరియంట్లలో డ్యూయల్ మోటార్తో కూడిన ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) సెటప్ అందుబాటులోకి రానుంది.
హారియర్ ఈవీ 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 627 కి.మీ (ఆర్డబ్ల్యూడీ), 622 కి.మీ (ఏడబ్ల్యూడీ) క్లెయిమ్డ్ రేంజ్ ఇస్తోంది.
టటా సఫారీ ఈవీ 100 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ను కూడా సపోర్ట్ చేస్తుంది. అదనంగా, ఇందులో నార్మల్, స్నో/గ్రాస్, మడ్, సాండ్, రాక్, క్రాల్, కస్టమ్ వంటి మల్టిపుల్ టెర్రైన్ మోడ్స్ ఉండనున్నాయి.
Luxury car : సెలబ్రిటీల ఫేవరెట్ కారు ఇది- ఏకంగా రూ. 1కోటి ధర తగ్గింపు! కారణం ఇదే..
టాటా సఫారీ ఈవీ- డిజైన్, ఇంటీరియర్ ప్రత్యేకతలు..
టాటా సఫారీ ఈవీ బాహ్య రూపం ప్రస్తుత ఐసీఈ మోడల్నే పోలి ఉన్నప్పటికీ, ఈవీ గుర్తింపు కోసం కొన్ని మార్పులు చేశారు. క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్లు, ఈవీ బ్యాడ్జింగ్, ఏరో-ఆప్టిమైజ్డ్ అలాయ్ వీల్స్ దీనికి ప్రత్యేకతను ఇస్తాయి.
ఇక క్యాబిన్ లోపల 'టిడాల్' (టాటా ఇంటెలిజెంట్ డిజిటల్ ఆర్కిటెక్చర్ లేయర్) అనే టెక్నాలజీని అందించారు. దీని ద్వారా:
ఓటీఏ అప్డేట్స్
540-డిగ్రీ సరౌండ్ వ్యూ ఫంక్షన్
అప్గ్రేడెడ్ లెవల్ 2 అడాస్
ఆటో-పార్క్ అసిస్ట్, సమ్మన్ మోడ్
యూపీఐ ఆధారిత ఇన్-కార్ పేమెంట్ సిస్టమ్ (డ్రైవ్పే)
వంటి వినూత్న ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.
టాటా సఫారీ ఈవీ- మార్కెట్ అంచనాలు..
సఫారీ ఈవీ విడుదల టాటా ఎలక్ట్రిక్ ఎస్యూవీ పోర్ట్ఫోలియోను పూర్తి చేస్తుంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది నేరుగా మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్తో పోటీ పడనుంది. దీని ధర సుమారు రూ. 22.5 లక్షల నుంచి రూ. 30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఈ ఏడాది ఇప్పటికే లాంచ్ అయిన సఫారీ పెట్రోల్ వెర్షన్ తర్వాత, ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ టాటాకు నెలకు అదనంగా 1000-1500 యూనిట్ల అమ్మకాలను తెచ్చిపెడుతుందని కంపెనీ ఆశిస్తోంది.
తరచూ అడిగ ప్రశ్నలు-
1. టాటా సఫారీ ఈవీ భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ 2026 ఆగస్టులో ఉత్పత్తి ప్రారంభించి, అదే ఏడాది దీపావళి పండుగ సీజన్ నాటికి విడుదల కానుంది.
2. సఫారీ ఈవీ సింగిల్ ఛార్జ్పై ఎంత రేంజ్ ఇస్తుంది?
ఇది 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో సుమారు 600 కి.మీ క్లెయిమ్డ్ రేంజ్ మరియు వాస్తవ పరిస్థితుల్లో దాదాపు 450 కి.మీ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది.
3. సఫారీ ఈవీలో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్ ఉంటుందా?
అవును, దీని హై-స్పెక్ వేరియంట్లలో డ్యూయల్ మోటార్తో కూడిన ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సెటప్ను టాటా మోటార్స్ అందించనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


