ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాల్లోని ఇరుకైన, మురికివాడల రూపురేఖలను మార్చేందుకు ఒక సరికొత్త రీడెవలప్మెంట్ నమూనాకు ఆమోదం తెలిపింది. ముంబైలోని ప్రసిద్ధ ధారావి మోడల్ ఆధారంగా ఈ భారీ పట్టణ పునర్నిర్మాణ ప్రాజెక్టును మొదటగా విశాఖపట్నంలోని వెలంపేట మురికివాడలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది. ఒక అధికారిక ప్రకటనలో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.

ప్రభుత్వ ఖజానాపై నేరుగా ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, అక్కడే నివసిస్తున్న పేద ప్రజలకు ఆధునిక వసతులతో కూడిన ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ఈ నమూనా ముఖ్య ఉద్దేశం. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కార్యక్రమంలో భాగంగా జోన్-IV, వార్డు నంబర్ 35 పరిధిలోని వేలం పేట స్లమ్ను డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ట్రాన్స్ఫర్(DBFT) ప్రాతిపదికన అభివృద్ధి చేయడానికి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(GVMC)కి ప్రభుత్వం పూర్తి అనుమతులు మంజూరు చేసింది.
కేవలం 1,986.45 చదరపు మీటర్ల చిన్న స్థలంలో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. దాదాపు 45 మీటర్ల ఎత్తు వరకు ఎత్తైన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ను నిర్మిస్తారు. ఈ కాంప్లెక్స్లో స్థానిక నివాసితుల కోసం 177 అధునాతన హౌసింగ్ యూనిట్లను కేటాయిస్తారు.
ఈ ప్రాజెక్టుకు సంప్రదాయ ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా, ప్రైవేట్ డెవలపర్లను ఆకర్షించేందుకు 'ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్' విధానాన్ని కీలకమైన అంశంగా చేర్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్టంగా 1:4 నిష్పత్తి వరకు టీడీఆర్ నిష్పత్తిని బిడ్డింగ్ పారామిటర్గా అనుమతించారు.
పోటీతత్వ టెండర్ విధానం ద్వారా తక్కువ టీడీఆర్ ప్రతిపాదించే ప్రైవేట్ సంస్థకు ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును అప్పగిస్తారు. నిర్మాణ వ్యయానికి పరిహారంగా ఈ టీడీఆర్ హక్కులను పొందే డెవలపర్, పట్టణంలోని విలువైన భూమిని మార్కెట్ ఆధారిత యంత్రాంగం ద్వారా సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవకాశం లభిస్తుంది.
ఈ పునర్నిర్మాణ ప్రాజెక్టును లాభదాయకంగా, వేగవంతంగా పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ భవన నిబంధనల (AP Building Rules) కింద ప్రభుత్వం అనేక ప్రత్యేక సడలింపులను ఇచ్చింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఎత్తైన భవనాల నిర్మాణానికి అనుమతి ఇస్తున్నారు. స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకుని సాధారణ సెట్బ్యాక్ నిబంధనల తగ్గించారు.
{{/usCountry}}ఈ పునర్నిర్మాణ ప్రాజెక్టును లాభదాయకంగా, వేగవంతంగా పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ భవన నిబంధనల (AP Building Rules) కింద ప్రభుత్వం అనేక ప్రత్యేక సడలింపులను ఇచ్చింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఎత్తైన భవనాల నిర్మాణానికి అనుమతి ఇస్తున్నారు. స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకుని సాధారణ సెట్బ్యాక్ నిబంధనల తగ్గించారు.
{{/usCountry}}సాధారణంగా ఉండే 22 శాతం పార్కింగ్ స్థల నియమాన్ని సవరించి, మొత్తం నిర్మిత ప్రాంతంలో కేవలం 10 శాతానికి పార్కింగ్ మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. జీవీఎంసీ, పట్టణాభివృద్ధి సంస్థలు, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు చెల్లించాల్సిన వివిధ రకాల రుసుములు, ఛార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది.
వెలంపేట పునర్నిర్మాణాన్ని నిర్ణీత సమయపరిమితిలోగా పూర్తి చేసి, దీనిని మోడల్ ప్రాజెక్టుగా మార్చాలని జీవీఎంసీని ప్రభుత్వం ఆదేశించింది. దీని విజయవంతమైన అమలు ఆధారంగా, విశాఖ వ్యాప్తంగా నివసిస్తున్న పేద ప్రజలను వారి పాత నివాస ప్రాంతాల నుండి ఎక్కడికీ తరలించకుండా, వారు ఉన్న చోటే ఆధునిక గృహాలను అందించే ఆలోచన చేస్తున్నారు.
దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మురికివాడల పునర్నిర్మాణం, మధ్యతరగతి గృహనిర్మాణం కోసం ఒక నూతన విధివిధానాల కరపత్రాన్ని రూపొందించాలని పురపాలక పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మోడల్ విజయవంతమైతే, ఆంధ్రప్రదేశ్ అంతటా పాతబడిన, రద్దీగా ఉన్న పట్టణ ప్రాంతాలను నవీకరించడానికి, అత్యంత విలువైన పట్టణ భూములను ఆర్థికంగా సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక విప్లవాత్మకమైన మార్గదర్శకంగా నిలుస్తుంది.