భాషాభిమానులకు, రచయితలకు ఆంధ్ర సారస్వత పరిషత్తు ఒక మంచి అవకాశాన్ని ముందుకు తెచ్చింది. చిన్నారులను అలరించేలా, వారిలో తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచేలా ‘బాలల గేయ రచన’ పోటీలను నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. వచ్చే డిసెంబర్ 5, 6 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులోని నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు కోలాహలంగా జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక వేడుకలను పురస్కరించుకుని ఈ ప్రత్యేకమైన సాహితీ పోటీకి శ్రీకారం చుట్టారు.

తెలుగు భాషా వికాసానికి, బాల సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఈ పోటీలకు సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ గేయ రచన పోటీలలో పాల్గొనడానికి ఎటువంటి వయోపరిమితి లేదు. సాహిత్యాభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎవరైనా ఇందులో భాగస్వాములు కావచ్చు.
మీరు రాసే బాలల గేయం గరిష్టంగా 15 పంక్తులకు (లైన్లకు) మించకుండా ఉండాలి. తెలుగు భాషా వికాసం, మన సంస్కృతీ సాంప్రదాయాలు, భారతీయుల జీవన విధానం, దేశభక్తి వంటి అంశాలపై పిల్లల్లో ఆసక్తిని పెంపొందించేలా రచనలు రూపుదిద్దుకోవాలి.
పూర్తిచేసిన గేయం రాతప్రతిని పీడీఎఫ్ రూపంలోకి మార్చేసి ఆగస్టు 10వ తేదీలోగా 9866995085 అనే వాట్సప్ నంబరుకు పంపించాల్సి ఉంటుంది.
పోటీలలో ప్రతిభ చూపిన ఉత్తమ గేయాలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులతో పాటు సత్కారాలు ఉంటాయని సంస్థ కార్యదర్శి ధవేజీ, ముఖ్య సమన్వయకర్తలు డాక్టర్ మురళీధర్రెడ్డి, కోగంటి శ్రీకాంత్లు తెలియజేశారు.
ప్రథమ బహుమతి: రూ. 3,000
ద్వితీయ బహుమతి: రూ. 2,000
తృతీయ బహుమతి: రూ. 1,000
ప్రోత్సాహక బహుమతులు: 10 మందికి రూ. 500 చొప్పున అందజేస్తారు.
విజేతలకు నగదుతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికలను డిసెంబర్లో జరిగే నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణంలో ఘనంగా అందజేస్తారు. ఈ పోటీలో ఎంపికైన అత్యుత్తమ గేయాలకు ఆడియో రికార్డింగ్ చేసి, వాటిని అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా దృశ్య రూపాలుగా (AI Videos) మారుస్తారు. అనంతరం వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు.
{{/usCountry}}విజేతలకు నగదుతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికలను డిసెంబర్లో జరిగే నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణంలో ఘనంగా అందజేస్తారు. ఈ పోటీలో ఎంపికైన అత్యుత్తమ గేయాలకు ఆడియో రికార్డింగ్ చేసి, వాటిని అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా దృశ్య రూపాలుగా (AI Videos) మారుస్తారు. అనంతరం వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు.
{{/usCountry}}తెలుగు భాషా సంస్కృతులను భావి తరాలకు అందించే ఈ బృహత్తర క్రతువులో రచయితలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. పిల్లలకు తెలుగు భాషపై మక్కువ పెరిగేలా గేయ రచనలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.