...
...
Next Story

AP D-Pharmacy 2026 : ఆంధ్రప్రదేశ్‌ డి.ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్.. ఆగస్టు 31 నుంచి స్టార్ట్

AP D-PHARMACY 2026 : ఆంధ్రప్రదేశ్‌ డి.ఫార్మసీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు, వెబ్ ఆప్షన్ల తేదీలు ఇక్కడ చూడండి.

Published on: Aug 30, 2026, 10:35:45 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ డిప్లొమా ఇన్ ఫార్మసీ (D.Pharmacy) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన విడుదల చేసింది. AP D-PHARMACY 2026 అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఏపీ డి.ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్
ఏపీ డి.ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్

ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఆగస్టు 31, 2026 నుండి సెప్టెంబర్ 05, 2026 వరకు ఉంటుంది. హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ 02 నుండి సెప్టెంబర్ 05 వరకు చేస్తారు. వెబ్ ఆప్షన్లు నమోదు చేసేందుకు గడువు సెప్టెంబర్ 03 నుండి సెప్టెంబర్ 06 దాకా ఉంటుంది. వెబ్ ఆప్షన్లలో మార్పులకు సెప్టెంబర్ 07న అవకాశం కల్పిస్తారు.

సెప్టెంబర్ 09న సీట్ల కేటాయింపు ఉంటుంది. కాలేజీల్లో రిపోర్టింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్ సెప్టెంబర్ 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 10 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.

కౌన్సెలింగ్ ఆన్‌లైన్ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన ఫీజులు:OC / BC అభ్యర్థులకు రూ. 1,250, SC / ST అభ్యర్థులకు రూ. 650గా ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డ్ లేదా యూపీఐ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు.

అభ్యర్థులు కౌన్సెలింగ్ ఆన్‌లైన్ ప్రక్రియ, హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లే సమయంలో పలు పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. AP D.PHARMACY-2026 ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, అభ్యర్థి ఆధార్ కార్డ్ , పదో తరగతి మార్కుల మేమో, ఇంటర్మీడియట్ మార్కుల మేమో, 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్లు, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, EWS సర్టిఫికేట్, నివాస ధ్రువీకరణ పత్రంలాంటి పత్రాలు ఉండాలి.

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఫీజు ఏడాదికి రూ. 4,700, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఫీజు ఏడాదికి రూ. 25,000, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. జూలై 1, 2026 నాటికి గరిష్ట వయోపరిమితి SC/ST/BC అభ్యర్థులకు 29 సంవత్సరాలు, ఓసీ అభ్యర్థులకు 25 సంవత్సరాలు ఉన్నవారు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు.

అభ్యర్థులు కౌన్సెలింగ్ సమాచారం, ఆప్షన్ల నమోదుకు కేవలం అధికారిక వెబ్‌సైట్ https://polycet.ap.gov.in ను మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచించారు. ఏదైనా సహాయం లేదా సాంకేతిక సమస్యల కోసం 7842075469, 7842085469, 7842095469 హెల్ప్‌లైన్ నంబర్లను ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:00 గంటలలోపు సంప్రదించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe