AP EAPCET 2026 Final Phase Counselling : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (APEAPCET)-2026 తుది దశ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఉన్నత విద్యామండలి నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 27వ తేదీ వరకు కొనసాగనుంది. ఈఏపీసెట్-2026 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని కళాశాలలు, కోర్సులకు సంబంధించి ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
AP EAPCET ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ - ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : ఆగస్టు 17, 2026 నుండి ఆగస్టు 20, 2026 వరకు
- హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల ఆన్లైన్ వెరిఫికేషన్ : ఆగస్టు 17, 2026 నుండి ఆగస్టు 21, 2026 వరకు
- వెబ్ ఆప్షన్ల నమోదు : ఆగస్టు 17, 2026 నుండి ఆగస్టు 22, 2026 వరకు
- నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం : ఆగస్టు 23, 2026
- సీట్ల కేటాయింపు (సీట్ అలాట్మెంట్) ఫలితాల విడుదల : ఆగస్టు 26, 2026
- కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ - వ్యక్తిగతంగా హాజరుకావడం : ఆగస్టు 27, 2026 నుండి ఆగస్టు 31, 2026 వరకు
- కళాశాలల్లో తరగతుల ప్రారంభం ఆగస్టు 27, 2026.

విద్యార్థులు నిర్ణీత గడువులోగా అధికారిక పోర్టల్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, ధ్రువపత్రాలను సరిచూసుకోవాలని కౌన్సెలింగ్ నిర్వహణ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొదటి విడత కౌన్సెలింగ్ లో సీటు రానివారితో పాటు గతంలో సీటు ఖరారైన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనొచ్చు. అయితే మొదటి విడత కౌన్సెలింగ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటు ఖరారు చేసుకుంటే… ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉండదు.