ఆంధ్రప్రదేశ్లోని 164 మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. 12.04.2026 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలు పనిచేస్తున్నాయో.. ఆ పాఠశాలలో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో తెలుగు /ఇంగ్లీషు మీడియాల్లో నిర్వహిస్తారు.

ఈ ఆదర్శ పాఠశాలల్లో బోధన ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఇందులో చదవడానికి ఎలాంటి ఫీజు ఉండదని గుర్తుంచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 24-02-2026
- ఫీజు చెల్లింపు చివరి తేదీ- 31-03-2026
- పరీక్ష తేదీ (పాఠశాలలో)- 12-04-2026
- మెరిట్, ఎంపిక లిస్ట్ విడుదల- 27-04-2026
- సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ - 30-04-2026
- తరగతులు ప్రారంభ తేదీ జూన్ 2026 (ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం)
ప్రవేశ అర్హతలు
ఓసీ, బీసీ కేటగిరీకి చెందిన విద్యార్థులు 01.09.2014-31.08.2016 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన విద్యార్థులు 01.09.2012-31.08.2016 మధ్య పుట్టి ఉండాలి.
సంబంధిత జిల్లాలల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలల్లో 2024-25, 2025-26 విద్యా సంవత్సరాలలో చదివి ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరములో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రం కోసం www.cse.ap.gov.in లేదా www.apms.apcfss.in దొరుకుతుంది.
దరఖాస్తు ఎలా చేయాలి?
23-02-2026 నుండి 31-03-2026 వరకు నెట్ బ్యాంకింగ్/క్రెడిట్/డెబిట్ కార్డు ఉపయోగించి పేమెంట్ గేట్వే ద్వారా పరీక్ష రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జర్నల్ నెంబరు కేటాయిస్తారు. ఆ నెంబర్ ఆధారంగా www.cse.ap.gov.in, www.apms.apcfss.inలో దరఖాస్తు చేసుకోవాలి.
ఓసీ, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 చెల్లించాలి. సీటు ప్రతిభ ఆధారంగా అంటే ప్రవేశపరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా వస్తుంది. ప్రవేశపరీక్షా ప్రశ్నాపత్రము ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షలో 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్ష తెలుగు, గణితం, సాంఘిక అండ్ సైన్స్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులపై ఉంటుంది.
{{/usCountry}}ఓసీ, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 చెల్లించాలి. సీటు ప్రతిభ ఆధారంగా అంటే ప్రవేశపరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా వస్తుంది. ప్రవేశపరీక్షా ప్రశ్నాపత్రము ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షలో 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్ష తెలుగు, గణితం, సాంఘిక అండ్ సైన్స్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులపై ఉంటుంది.
{{/usCountry}}