...
...
Next Story

ఉత్తరాంధ్ర ఆలయాలకు మహా శివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఉత్తరాంధ్రలోని ప్రముఖ ఆలయాలకు మహా శివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేశారు.

Published on: Feb 12, 2026, 05:36:06 IST
Advertisement

ఉతరాంధ్రలో మహా శివరాత్రికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మహాశివరాత్రి వేడుకలకు ఉత్తరాంధ్ర సిద్ధమైంది. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం ఉండటంతో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వస్తారని భావిస్తున్నారు.

ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

విశాఖపట్నంలో ఫిబ్రవరి 14 అర్ధరాత్రి నుండి ఫిబ్రవరి 15 సాయంత్రం వరకు గాజువాక, కూర్మన్నపాలెం, అగనంపూడి నుండి అప్పికొండకు 94 ప్రత్యేక బస్సులు నడుస్తాయని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు ప్రకటించారు. అదనంగా 110 బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాలను ఆర్‌కే బీచ్‌కు కనెక్ట్ చేస్తాయి. మత్స్యగుండమ్మకు 15 బస్సులు, కల్యాణపులోవకు ఐదు బస్సులు వెళ్తాయి.

విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అప్పికొండ సోమేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యంగా పారిశుధ్యం, వైద్య సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్ నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.

శ్రీకాకుళంలోని ప్రధాన శైవ క్షేత్రాలైన సబకోట, రావివలస, రామతీర్థం, శ్రీముఖలింగం వంటి వాటికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసలను నడిపేందుకు ప్రణాళిక వేసింది. మహాశివరాత్రి సందర్భంగా పర్యవేక్షణ కోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అధికారులు వివిధ విభాగాల సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. సీసీటీవీ, డ్రోన్ నిఘాతో భద్రతను పెంచాలని, ఫిబ్రవరి 18న జరిగే చక్రతీర్థ యాత్రకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుంధర్ రెడ్డి రామతీర్థం, పుణ్యగిరి, ధర్మవరం, సంగమేశ్వర స్వామి ఆలయాల వద్ద అన్ని ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. ఒకే రద్దీ ఎక్కువగా లేకుండా చూసుకోవాలన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పరమకొండ ఆలయంలో పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. క్యూలను సరిగా నిర్వహించాలని, డస్ట్‌బిన్‌లు, ఫుడ్ స్టాల్స్, భక్తుల కోసం వేడి నీటి సేవలు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇలా మహాశివరాత్రికి ఉత్తరాంధ్ర ఆలయాలు సిద్ధమవుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe