ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ఆర్టీసీ ఆధునికీకరణ లక్ష్యంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 750 ఎలక్ట్రిక్ బస్సులలో మొదటి విడతగా 350 ఈ-బస్సులను ఈ ఏడాది అక్టోబరు నాటికి రోడ్డెక్కించేందుకు ఏపీఎస్ఆర్టీసీ వేగంగా అడుగులు వేస్తోంది. మిగిలిన బస్సులను డిసెంబరు ఆఖరు నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పర్యావరణ పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం పెద్దపీటప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించడం, వాయు కాలుష్యాన్ని నియంత్రించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ-బస్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. భవిష్యత్తులో డిపోల వారీగా పాత డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పీఎం ఈ-బస్ సేవా పథకం (PM e-Bus Sewa Scheme) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. అయితే ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా సేవలందించేందుకు రాష్ట్రానికి అదనంగా మరో 300 ఈ-బస్సులను కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
ఈ-బస్సులకు నిరంతర ఛార్జింగ్ సదుపాయం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోలలో ప్రత్యేక ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లు, ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పనులు శరవేగంగా పూర్తి చేసి, మొదటి విడతలో 350 బస్సులను అక్టోబరు కల్లా విజయవంతంగా ప్రారంభించగలమని ఛైర్మన్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, అమరావతి, కడప, రాజమండ్రి వంటి ప్రధాన నగరాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రాధాన్యత క్రమంలో వీటిని అందుబాటులోకి తేనున్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళా సాధికారతకు, వారి ఆర్థిక బలానికి ఎంతగానో తోడ్పడుతోందని కొనకళ్ల నారాయణరావు వెల్లడించారు. ఈ పథకం ద్వారా మహిళలు, వికలాంగులు ఎంతో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు ఉచితంగా చేరుకుంటున్నారు.మహిళల ప్రయాణ సౌకర్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఇప్పటివరకు ఉచిత ప్రయాణ సబ్సిడీ రూపంలో రూ.3,000 కోట్లకు పైగా ఆర్థిక భారాన్ని భరించింది. ఈ-బస్సుల రాకతో బస్సుల్లో రద్దీ నియంత్రణలోకి రావడంతో పాటు ప్రయాణికులకు సరికొత్త అనుభూతి లభించనుంది.
{{/usCountry}}రాష్ట్రంలో అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళా సాధికారతకు, వారి ఆర్థిక బలానికి ఎంతగానో తోడ్పడుతోందని కొనకళ్ల నారాయణరావు వెల్లడించారు. ఈ పథకం ద్వారా మహిళలు, వికలాంగులు ఎంతో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు ఉచితంగా చేరుకుంటున్నారు.మహిళల ప్రయాణ సౌకర్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఇప్పటివరకు ఉచిత ప్రయాణ సబ్సిడీ రూపంలో రూ.3,000 కోట్లకు పైగా ఆర్థిక భారాన్ని భరించింది. ఈ-బస్సుల రాకతో బస్సుల్లో రద్దీ నియంత్రణలోకి రావడంతో పాటు ప్రయాణికులకు సరికొత్త అనుభూతి లభించనుంది.
{{/usCountry}}