...
...
Next Story

నెయ్యి కల్తీ కేసులో వైసీపీకి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

నెయ్యి కల్తీ కేసుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. ప్రసాదాన్ని కల్తీ చేసి దేవుడికి పెట్టింది కాక నెయ్యి లేదు కాబట్టి కల్తీ లేదు అని బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published on: Feb 5, 2026, 15:15:22 IST
Advertisement

తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ కేసులో వైసీపీకి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. మత విశ్వాసం సున్నితమైన సమస్య అని… ఈ విషయాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు.

చాలా అపచారాలు జరిగాయి - డిప్యూటీ సీఎం పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్

“2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో చాలా అపచారాలు జరిగాయి. మతం పరంగా మాట్లాడటానికి సున్నితమైన అంశాలు. ప్రభుత్వంలోకి వచ్చిన రెండో నెలల్లో ఆరోపణలు, విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి అవసరం ఏముంటుంది ? ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాట్లాడాం. రేపు ప్రజలు మాకు తెలిసినా ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు అనే బయటకొచ్చి మాట్లాడాం. హైందవ సంస్కృతి మీద వైసీపీ తరచుగా దాడులు, అపవిత్రాలకు తెగబడుతుండడం వల్ల ఎదుర్కోవాల్సిన అవసరం, మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

"వ్యక్తుల మీద, ప్రత్యర్ధుల మీద పగలు ఉంటాయి కానీ వీళ్ళ పరంపరకి భగవంతుడి మీద పగ ఉండటం ఏంటో అర్థం కాదు. ప్రత్యేకించి ఏడుకొండలస్వామి మీద పగ. ఏడు కొండలు ఎందుకు నీకు రెండు కొండలు చాలు అంటారు.దీన్ని కల్తీ నెయ్యి అనడానికి కూడా లేదు ఎందుకంటే దీనిలో అసలు నెయ్యే లేదు.తప్పు జరిగిపోయింది అని క్షమాపణ అడక్కపోగా ఎదురు మాపై మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా.. భగవంతుడిపైన పగ పెట్టుకున్నాడు సర్వనాశనం అయిపోతాడు, బతికిన దాఖలాలు కూడా లేవు గుర్తు పెట్టుకోండి" అంటూ పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

“వెనకడుగు వేసేది లేదు.. వైసీపీ హయాంలో చాలా పొరపాట్లు జరిగాయి. 2022 లోనే ఇలా కల్తీ జరుగుతుంది అని రిపోర్ట్ ఇస్తే దాన్ని బయటకి రానివ్వలే. అంటే మీకు తెలిసే చేశారు. ఇవన్నీ తెలిసే అయోధ్యకి కల్తీ లడ్డూలు పంపించారు. ఇది విశ్వాసాల మీద మీరు కొట్టిన దెబ్బ” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏక సభ్య కమిటీ - సీఎం ప్రకటన

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యిపై ఏకసభ్య కమిటీ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. “ నివేదికలన్నీ ఏకసభ్య కమిటీ ఎదుట ఉంచుతాం. తప్పు చేసిన ఎవరినీ వదిలేది లేదు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చింది. సీబీఐ నివేదికపై ఏకసభ్య కమిటీ విచారణ చేస్తుంది” అని ప్రకటించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe